ఆదిలాబాద్ : మాయమాటలతో మోసాలకు పాల్పడుతున్న దొంగ బాబాను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఉట్నూర్ మండలం శ్యాంపూర్ కు చెందిన సూర్య వంశీ ఇటీవల బాబా అవతారమెత్తాడు. తాను పూజల ద్వారా డబ్బులు రెండింతలు చేస్తానని పలువురిని నమ్మించాడు.
బాబా మాయ మాటలు నమ్మి ఆదిలాబాద్ కు చెందిన ఫారూక్ లక్ష రూపాయలు ఇచ్చి పూజలు చేయించాడు. పూజల అనంతరం బాబా రూ.లక్షన్నర ఇచ్చి నమ్మించాడు. ఈనెల 15న 10 లక్షల రూపాయలు ఫారుఖ్ బంధువులు బాబాకి ఇచ్చి పూజలు చేయించగా ఆ డబ్బులతో దొంగ బాబా ఉడాయించాడు.
బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దొంగబాబా సూర్యవంశీతో పాటు అతడికి సహకరించిన మరో మహిళ సంగీతను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 11 లక్షల 70 వేలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
T20 World Cup | దుబాయ్లో కలిసిన ధోనీ, గేల్.. ఫొటో వైరల్
Nigeria Killings: నైజీరియాలో కాల్పులు, 43 మంది మృతి
Singur project | సింగూరు ప్రాజెక్టుకు పెరిగిన వరద