(Nigeria Killings) అబుజా : వాయవ్య నైజీరియాలో కాల్పుల మోత మోగింది. సోకోటో రాష్ట్రంలోని ఓ గ్రామ మార్కెట్పై సాయుధుడు చేసిన దాడిలో కనీసం 43 మంది మరణించారు. ఈ విషయాన్ని ఏజెన్సీ ఫ్రాన్స్-ప్రెస్సే నివేదించింది. గోరోనియో గ్రామంలో నిర్వహించిన వీక్లీ మార్కెట్లో సాయుధ బందిపోట్లు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 43 మంది మరణించారు. ఈ విషయాన్ని సోకోటో ప్రభుత్వ ప్రతినిధి ముహమ్మద్ బెల్లో ధ్రువీకరించారు. ఘటనపై ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది.
స్థానిక ప్రీమియం టైమ్స్ వార్తాపత్రిక ప్రత్యక్ష సాక్షులను ఉటంకిస్తూ.. వీక్లీ మార్కెట్పై జరిగిన సాయుధ దాడిలో 30 మందికి పైగా మరణించారు. మరో 20 మంది గాయపడ్డారు. దాదాపు 200 మంది బందిపోటు ముఠా సభ్యులు మోటార్ సైకిళ్లపై మార్కెట్లోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు వార్తాపత్రిక తెలిపింది. వాయవ్య నైజీరియా ప్రాంతంలో బందిపోట్లు గత ఏడాది కాలంగా రెచ్చిపోతున్నారు. బందిపోట్ల దాడి సమాచారం ఇచ్చేందుకు పోలీసులు తొలుత నిరాకరించారు.
సరిగ్గా 10 రోజుల క్రితం నైజీరియా సరిహద్దులోని నైజర్కి సమీపంలో ఉన్న ఒక గ్రామంలో కూడా బందిపోట్లు మార్కెట్పై దాడి చేసి 19 మందిని ఊచకోత కోశారు. కాగా, గోరోనియో జనరల్ దవాఖాన మార్చురీలో దాదాపు 60 మృతదేహాలు ఉన్నాయని, తప్పించుకునే ప్రయత్నంలో చాలా మంది గాయపడ్డారని స్థానిక వ్యాపారి అయిన ఇలియాస్ అబ్బా ఒక వార్తసంస్థకు తెలిపారు. ఇలాఉండగా, సైనిక కార్యకలాపాలు తీవ్రం కావడంతో జంఫారా రాష్ట్రంలోని అన్ని టెలిఫోన్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాలని ప్రభుత్వం గత నెలలో ఆదేశించింది.
చైనాలో మళ్లీ కరోనా జాడలు, పలు నగరాల్లో లాక్డౌన్
అమృత్సర్లో కెప్టెన్ పోటీ చేస్తే ఆయన ప్రజాదరణ తేలుతుంది: నవజ్యోత్ కౌర్
భారత వైమానిక దళానికి చేరిన తొలి స్వదేశీ మిగ్-21
చెమటతో రక్తంలో చక్కెరను కనిపెట్టొచ్చు.. డివైజ్ సిద్ధం చేసిన అమెరికన్ శాస్త్రవేత్తలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..