(Blood sugar) ఇప్పటివరకు బ్లడ్ షుగర్ ఎంత ఉన్నదో తెలుసుకునేందుకు మన శరీరం నుంచి కొంత రక్తం తీయాల్సి వచ్చేది. రక్తం తీయాలంటే సూది గుచ్చడం చాలా మందికి ఇబ్బందికరంగా ఉంటుంది. వృద్ధులకైతే మరీ తలనొప్పిగా ఉంటుంది. ఇప్పుడు అమెరికా పరిశోధకులు తయారుచేసిన డివైజ్తో ఎలాంటి రక్తం తీయాల్సిన అవసరమే ఉండదు. కేవలం మన శరీరంపై వచ్చే చెమట ఆధారంగా రక్తంలో చక్కెర స్థాయిలను కనిపెట్టొచ్చు. ఈ పరికరాన్ని చేతిపై ధరించడం ద్వారా రక్తంలో చక్కెరను చెక్ చేసుకోవచ్చునంటున్నారు పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీ పరిశోధకులు. దీనికి సంబంధించిన సమాచారాన్ని ‘బయోసెన్సర్స్, బయోఎలక్ట్రానిక్స్’ జర్నల్లో ప్రచురించారు.
ఈ డివైజ్లో నికెల్ మెటల్ను ఉపయోగించారు. ఇది రక్తంలో చక్కెరకు సున్నితంగా ఉంటుంది. ఈ డివైజ్ తయారీలో బంగారం కూడా వినియోగించారు. దీని కారణంగా ఎవరికైనా అలెర్జీ వచ్చే ప్రమాదం చాలా తక్కువ అని చెప్తున్నారు పరిశోధకులు. ఈ డివైజ్ రక్తంతో పోలిస్తే చెమటలోని గ్లూకోజ్ 100 రెట్లు ఎక్కువగా గుర్తించడంలో పనిచేస్తుందని పరిశోధకులు చెప్తున్నారు. ఇప్పటివరకు ఉన్న పరికరాలు నిర్దిష్ట ఎంజైమ్లతో ఆల్కలీన్ ద్రవాలను ఉపయోగించడం వలన చర్మం దెబ్బతినే ప్రమాదం ఉంటుందని పరిశోధనలో పేర్కొన్నారు. ఈ డివైజ్లో ఎలాంటి ఎంజైమ్లు ఉపయోగించలేనందున చర్మానికి ఎలాంటి ఇబ్బంది ఉండదంటున్నారు. ఇప్పుడు డయాబెటిస్ ఉన్న రోగులకు ఈ సాంకేతికతను ఉపయోగించి పరీక్షించేందుకు వైద్యులు, ఆరోగ్య సంరక్షకులతో కలిసి పనిచేయాలనుకుంటున్నట్లు పరిశోధకుడు చెంగ్ తెలిపాడు.
వచ్చే ఏడాది ఐటీలో భారీగా కొలువులు
దీపావళి పండుగ ఆఫర్లు ప్రకటించిన బ్యాంక్ ఆఫ్ ఇండియా
పడిపోయిన బైడెన్పై ప్రజల్లో విశ్వాసం.. కారణమిదేనా?
సూరత్ ప్యాకేజింగ్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం, ఇద్దరు మృతి
రైతు ఉద్యమం ముగింపునకు గవర్నర్ కొత్త సలహా.. ఏంటంటే?
బెనజీర్ భుట్టో కాన్వాయిపై ఆత్మాహుతి దాడి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..