(IT Jobs) న్యూఢిల్లీ : భారతదేశంలోని టాప్ 4 ఐటీ కంపెనీలు నియామకాల లక్ష్యాన్ని పూర్తి చేసే పనిలో నిమగ్నమై ఉన్నాయి. రానున్న ఆర్థిక సంవత్సరంలో 1.6 లక్షల మంది ఫ్రెషర్లకు నియమించుకోవాలని టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్ టెక్ ప్రణాళికలు సిద్ధం చేశాయి. ఇటీవలి కాలంలో ఉద్యోగులు సంస్థలను వదిలిపెట్టి పోతుండటం ఎక్కువవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తున్నది. ఈ నాలుగు కంపెనీలు గత ఏడాదిలో 82,000 మంది ఫ్రెషర్లను నియమించుకున్నాయి. విప్రో 25 వేల మంది ఫ్రెషర్లకు ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధమవగా.. టీసీఎస్ 40 వేల మందిని, హెచ్సీఎల్ 22 వేల మందిని హైర్ చేసుకోనున్నట్లు తెలుస్తున్నది.
కరోనా ఆంక్షల సడలింపు తర్వాత కాంటాక్ట్లెస్ చెక్-ఇన్ సౌకర్యాలలో పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఆఫ్లైన్ రిటైలర్లు కూడా తమ వ్యాపారాన్ని నడపడానికి ఐటీలో పెట్టుబడి పెడుతున్నారు. ఈ విషయాలన్నీ క్లౌడ్ ఆర్కిటెక్చర్, సైబర్ సెక్యూరిటీ, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్/మెషిన్ లెర్నింగ్ వంటి నైపుణ్యాల కోసం డిమాండ్ను పెంచాయి. దీని కారణంగా ఐటీ రంగంలో నియామకాలు పెరుగనున్నాయని నిపుణులు చెప్తున్నారు. ఇలా ఉండగా, ఐటీ కంపెనీల్లో ఎంప్లాయి లీవింగ్ రేట్ కూడా పెరుగుతున్నది. మునుపటి త్రైమాసికాల్లో టీసీఎస్ లో ఎంప్లాయి లీవింగ్ రేట్ 8.6 శాతం నుంచి 11.9 శాతానికి పెరిగింది. విప్రో, ఇన్ఫోసిస్ కంపెనీల్లో 20 శాతం కంటే ఎక్కువగా, హెచ్సీఎల్ టెక్ సంస్థలో 15.7 శాతం పైగా ఎంప్లాయి లీవింగ్ రేట్ ఉన్నది. కంపెనీలను విడిచిపెట్టే ప్రక్రియ తదుపరి రెండు-మూడు త్రైమాసికాల్లో కొనసాగవచ్చని ఐటీ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
దీపావళి పండుగ ఆఫర్లు ప్రకటించిన బ్యాంక్ ఆఫ్ ఇండియా
పడిపోయిన బైడెన్పై ప్రజల్లో విశ్వాసం.. కారణమిదేనా?
సూరత్ ప్యాకేజింగ్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం, ఇద్దరు మృతి
రైతు ఉద్యమం ముగింపునకు గవర్నర్ కొత్త సలహా.. ఏంటంటే?
బెనజీర్ భుట్టో కాన్వాయిపై ఆత్మాహుతి దాడి
ఉచిత వైఫై తీసుకుంటున్నారా? అయితే, మీ ఫోన్ ప్రమాదంలో పడ్డట్లే..! ఎలాగంటే..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..