(Today History) భారతదేశంలో తయారు చేసిన మొట్టమొదటి మిగ్ -21.. 51 ఏండ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున భారత వైమానిక దళంలో చేరింది. పాకిస్తాన్పై జరిగిన రెండు యుద్ధాల్లో నిర్ణయాత్మక ఆధిక్యాన్ని కనబర్చింది. దీనికన్న ఐదారేండ్ల ముందే రష్యాలో తయారైన మిగ్ -21 లు వైమానిక దళానికి వచ్చాయి. రష్యా, చైనాల తర్వాత మిగ్-21 మూడవ అతిపెద్ద ఆపరేటర్గా భారతదేశం నిలిచింది. 1964 లో ఈ విమానం ఎయిర్ఫోర్స్లో మొదటి సూపర్సోనిక్ ఫైటర్ జెట్గా చేరింది. తొలుత ఈ విమానాలు రష్యాలో తయారవగా.. ఈ విమానం సమీకరణ హక్కులు, సాంకేతికతను భారతదేశం పొందడంతో స్వదేశంలో వీటి తయారీకి బీజం పడింది.
అప్పటి నుండి ఇప్పటివరకు మిగ్ -21 వివిధ సందర్భాల్లో ముఖ్య పాత్ర పోషించింది. 1971 ఇండో-పాక్ యుద్ధం, 1999 కార్గిల్ యుద్ధంలో మిగ్-21 సేవలు నిరుపమానం. ఈ విమానాల తయారీని రష్యా 1985 లో నిలిపివేసింది. కానీ, ఇండియా దాని అప్గ్రేడ్ వేరియంట్ను ఉపయోగిస్తున్నది.
గత కొన్నేండ్లలో మిగ్ -21 వైమానిక దళంలో అనేక ప్రమాదాలకు గురై ప్రాణనష్టానికి దోహదపడటంతో దీని పేరు చెడిపోయింది. పుల్వామా దాడికి ప్రతిస్పందనగా పాకిస్తాన్లోని జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరంపై భారత వైమానిక దాడులకు పాల్పడిన సందర్భంలో వింగ్ కమాండర్ అభినందన్ నడిపి యుద్ధ విమానం కూడా మిగ్ -21. ప్రస్తుతం ఈ విమానాన్ని ‘ఫ్లయింగ్ కఫిన్’ అని పిలుస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా పెరుగుతున్న ప్రమాదాల కారణంగా వాటిని వైమానిక దళం నుంచి పూర్తిగా తొలగించాలనే డిమాండ్ ఉన్నది.
2018 : పంజాబ్లోని అమృత్సర్లో జరిగిన రైలు ప్రమాదంలో 60 మంది దుర్మరణం
2012: ముంబైలో తొలి కాఫీ హౌస్ను ప్రారంభించిన సీటెల్కి చెందిన స్టార్బక్స్
1960: పౌర హక్కుల కోసం ప్రచారం చేసిన అమెరికాకు చెందిన మార్టిన్ లూథర్ కింగ్-జూనియర్ అరెస్టు
1956: సంతకాలు చేసి దీర్ఘకాలిక యుద్ధాన్ని అధికారికంగా ముగించిన రష్యా, జపాన్
1943: యాంటీబయాటిక్ స్ట్రెప్టోమైసిన్ను కనుగొన్న శాస్త్రవేత్తలు
1910: ఖగోళ భౌతిక శాస్త్రవేత్త సుబ్రమణ్య చంద్రశేఖర్ జననం
చెమటతో రక్తంలో చక్కెరను కనిపెట్టొచ్చు.. డివైజ్ సిద్ధం చేసిన అమెరికన్ శాస్త్రవేత్తలు
వచ్చే ఏడాది ఐటీలో భారీగా కొలువులు
పడిపోయిన బైడెన్పై ప్రజల్లో విశ్వాసం.. కారణమిదేనా?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..