(Corona @ China) బీజింగ్ : చైనాలో కరోనా ఇన్ఫెక్షన్ జాడలు మరోసారి పెరుగుతూ భయపెడుతున్నాయి. సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 18 వరకు అత్యధిక కేసులు నమోదయ్యాయి. కొవిడ్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని దేశ ఉత్తర సరిహద్దుకు ఆనుకుని ఉన్న ప్రావిన్సుల్లో లాక్డౌన్ విధించారు. మంగోలియా, హువాన్, షాంగ్జీ ప్రావిన్సుల్లో లాక్డౌన్ కారణంగా ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. నిత్యావసరాల కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
నేషనల్ హెల్త్ కమిషన్ (ఎన్హెచ్సీ) ప్రకారం, ఇన్నర్ మంగోలియాలో తొమ్మిది కేసులు, హునాన్, షాంగ్జీ ప్రావిన్స్ల్లో రెండు చొప్పున కేసులు నమోదయ్యాయి. విదేశాల నుంచి వచ్చిన దాదాపు 25 మందికి కూడా కరోనా సోకినట్లు గుర్తించారు. అలాగే, సోమవారం నాడు 19 మంది రోగ లక్షణాలున్నవారు కూడా కనిపించారు. ప్రభుత్వం ప్రకారం, ప్రస్తుతం ఎవరు కూడా కరోనా కారణంగా చనిపోలేదు. ప్రభుత్వ డాటా ప్రకారం, దేశంలో ఇప్పటివరకు 4,636 మరణాలు సంభవించాయి. మెయిన్ల్యాండ్ చైనాలో 96,571 కరోనా ఇన్ఫెక్షన్ కేసులు ఉన్నాయి.
దాదాపు 76 వేల జనాభా ఉన్న మంగోలియా ప్రాంతంలో 9 కేసులు రావడంతో అక్కడ ప్రభుత్వం కఠిన లాక్డౌన్ విధించింది. రోడ్లపైకి ప్రజలను రాకుండా నిరోధిస్తుండటంతో నిత్యావసరాల కోసం ఇబ్బంది పడుతున్నారు. కరోనా కేసులు మరోసారి బయటపడటంతో మంగోలియా ప్రాంతంలో సినిమా హాళ్లు, ఇంటర్నెట్ కెఫెలు, జిమ్ వంటి ఇండోర్ పబ్లిక్ ప్రాంతాలను మూసిఉంచారు. అలాగే, పర్యాటక ప్రదేశాలను కూడా మూసివేశారు. మతపరమైన కార్యక్రమాలు చేపట్టకుండా నిషేధం విధించారు.
అమృత్సర్లో కెప్టెన్ పోటీ చేస్తే ఆయన ప్రజాదరణ తేలుతుంది: నవజ్యోత్ కౌర్
భారత వైమానిక దళానికి చేరిన తొలి స్వదేశీ మిగ్-21
చెమటతో రక్తంలో చక్కెరను కనిపెట్టొచ్చు.. డివైజ్ సిద్ధం చేసిన అమెరికన్ శాస్త్రవేత్తలు
వచ్చే ఏడాది ఐటీలో భారీగా కొలువులు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..