జయశంకర్ భూపాలపల్లి : సెల్ టవర్ ఎక్కి ఓ కిరాణా వ్యాపారి హల్చల్ సృష్టించాడు. జిల్లాలోని టేకుమట్ల మండల కేంద్రానికి చెందిన ఆదర్శ కిరాణా షాపు యజమాని రాజేశ్వరరావు మనోవేదనతో శనివారం ఉరితాడు, పురుగుల మందు డబ్బా పట్టుకొని ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉన్న సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు.
విషయం తెలుసుకున్న ఎస్ఐ రమణారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని బాధితునితో మాట్లాడారు. న్యాయం చేస్తానని చెప్తుండగానే తన వద్ద ఉన్న పురుగుల మందు నోట్లో పోసుకున్నాడు. ఈ క్రమంలో ఎస్ఐ బాధితుడితో మాట్లాడి కిందకు దింపి చిట్యాల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పూర్తి వివారాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
అంబులెన్స్లో ప్రసవం..తల్లి, బిడ్డ క్షేమం
దళారుల బెడద అరికట్టేందుకే కొనుగోలు కేంద్రాలు
తెలంగాణలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు
రాధాకృష్ణను పరామర్శించిన మంత్రి ఐకే రెడ్డి