మోత్కూరు, ఏప్రిల్ 30: జిల్లాలో ధాన్యం కొను గోళ్లు ముమ్మరంగా సాగున్నందున రవాణ వ్యవ స్థను మెరుగు పరిచి ధాన్యం ఎగమతిని వేగంగా చేయనున్నామని జిల్లా సివిల్ సప్లయ్ డీఎం గోపీ కృష్ణ తెలిపారు. జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లాలోని పలు ధాన్యం కొ నుగోలు కేంద్రాల్లో తూకాలు చేసి ఎగు మతులు లేక నిలిచిపోయిన ధాన్యం బ స్తాలను పరిశీలించారు. మోత్కూరులోని శ్రీనివాస, రామకృష్ణ రైస్ మిల్లులను తె రిపించారు. మోత్కూరు, గుండాల, అడ్డ గూడూరు, ఆత్మకూరు(ఎం) మండలా ల పరిధిలోని ఐకేపీ, పీఏసీఎస్, మార్కె టింగ్ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యంను మోత్కూరులోని నాలుగు రై స్మిల్లుల్లో దిగుమతి చేయడానికి చర్య లు తీసుకున్నట్లు తెలిపారు.సోమవారం మోత్కూరులోని పరమేశ్వర రైస్ మిల్లు లో ధాన్యం దిగుమతి జరిగేలా చ ర్యలు తీసుకున్నట్లు తెలిపారు జ
ిల్లాలో 271 కేంద్రాల్లో 5,298 మంది రైతుల నుంచి 48 వేలపై చిలు కు మెట్రిక్ టన్నులు ధా న్యాన్ని ఖరీదు చేశామని తెలి పారు. కల్లాల్లో తూకాలు చేసిన 2 వేల 900 టన్నుల ధాన్యం ఎగుమతి కాకుండా ఉన్నదని తెలిపారు. రెండు రో జుల్లో తూకాలైన ధాన్యాన్ని మొత్తం మి ల్లులకు చేర్చి దిగుమతి చేయనున్నట్లు తెలిపారు. రైతులు సమన్వయం పాటిం చాలని, రైతులందరీ ధాన్యం పూర్తి స్థా యిలో ఖరీదు చేసే వరకు కొనుగోలు కేంద్రాలు కొనసాగిం చనున్నట్లు తెలిపారు. గ్రేడింగ్ చేసిన ధాన్యంను దిగుమతి కేంద్రాల వద్ద మి ల్లర్లు కొర్రీలు పెట్టకుండా అదనపు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. కోవిడ్ నిబంధనలు పా టించి రైతులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మోత్కూరు రైతు సేవా సహకార సంఘం చైర్మన్ కంచర్ల అశోక్రెడ్డి, డైరెక్టర్లు సామ పద్మారెడ్డి, మిల్లరు మిట్టపల్లి నాగేశ్, సంఘం సీఈవో లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
4235 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు
ఆలేరు టౌన్: ఆలేరు మార్కెట్ యార్డులో 72 మంది రైతు ల నుంచి 4235 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ సెక్రటరీ చంద్రశేఖర్ మాట్లాడు తూ రైతులు ధాన్యాన్ని 17శాతం తేమ ఉండే వరకు ఆర బెట్టి కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలన్నారు. ధాన్యం ఆరబెట్టే సమయంలో రాళ్లు, మట్టి పెల్లలు, చెత్తాచెదారం, తాలు వంటివి తొలగించాలని కోరారు.
ధాన్యంకొనుగోలు కేంద్రాలు ప్రారంభం
బొమ్మలరామారం: రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల ను సద్వినియోగం చేసుకోవాలని పీఏసీఎస్ చైర్మన్ గూదె బాలనర్సయ్య అన్నారు. మండలంలోని రామలింగంపల్లి, జలా ల్పూర్ గ్రామాల్లో శుక్రవారం పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ రామిడి రాంరెడ్డి, సర్పంచ్లు కలమ్మ, శంకర్ గౌడ్, లక్ష్మి, ఎంపీటీసీలు హేమంత్రెడ్డి, నర్సింగ్రావు, మండలాధ్యక్షు డు వెంకటేశ్ గౌడ్, పీఏసీఎస్ డైరెక్టర్లు శ్రీనివాస్, ఆగయ్య, సెంటర్ ఇన్చార్జి మహేశ్ గౌడ్, నాగరాజు, మహేందర్ రెడ్డి, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.