హైదరాబాద్: రాష్ట్రంలో లాక్డౌన్ అంటూ నకిలీ జీవో సృష్టించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణలో మరోసారి లాక్డౌన్ అంటూ నకిలీ ఉత్తర్వులను సృష్టించిన ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాకు చెందిన శ్రీపతి సంజీవ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాత్రి వేళల్లో లాక్డౌన్ అంటూ నకిలీ జీవో సృష్టించాడు. నిందితుడు సంజీవ్ను హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ మీడియా ముందు హాజరు పరిచారు. శ్రీపతి సంజీవ్ మాదాపూర్లో నివాసం ఉంటున్నాడని చెప్పారు. సీఏ పూర్తిచేసి ఓ కంపెనీలో పనిచేస్తున్నాడని తెలిపారు. లాక్డౌన్పై గతంలో ఇచ్చిన జీవోను డౌన్లోడ్ చేసుకుని, తేదీలు మార్చి పాత జీవోను వాట్సప్ గ్రూప్లో షేర్ చేశాడని వెల్లడించారు. అతని స్నేహితులు దానిని ఇతర గ్రూపుల్లో పంపారని చెప్పారు. తప్పుడు జీవోలను ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..