జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలో దారుణం చోటు చోసుకుంది. భూ తగాదాలతో ప్రత్యర్థుల చేతుల్లో తండ్రి, ఇద్దరు కొడుకులు హతమైన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ విషాదకర సంఘటన కాటారం మండలం గంగారంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..గ్రామంలోని మంజు నాయక్ పత్తి చేను వద్ద గొడవ జరగగా.. ప్రత్యర్థులు గొడ్డళ్లతో దాడి చేశారు. ఈ క్రమంలో ప్రత్యర్థుల దాడిలో లావుడ్యా మంజు నాయక్ అతడి ఇద్దరు కొడుకులు లావుడ్యా సారయ్య, లావుడ్యా భాస్కర్ అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
కల్యాణలక్ష్మిని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనుల పరీశీలన
సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లు పూర్తి : మంత్రి ఎర్రబెల్లి
ఒకరికి తెలియకుండా ఇంకొకరిని.. ఆరుగురిని పెండ్లాడిన దొంగ బాబా