న్యాల్కల్/సంగారెడ్డి : తేనెటీగల దాడిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన
న్యాల్కల్ మండలం హద్నూర్ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన గుమ్మడి వెంకట్రెడ్డి (48) అనే వ్యక్తి కౌలుకు పొలం తీసుకొని పత్తి పంట సాగు చేశాడు.
ఆదివారం మధ్యాహ్నం కొండెంగల గుంపు చేనులో పత్తి కాయలు తింటుండటంతో వెంకట్ రెడ్డి ఆయన భార్య విట్టమ్మ, కుమారుడు శేఖర్ రెడ్డి కలిసి కొండెంగలను తరుముతుండగా.. కొండెంగలు మరో చెట్టు పైకి ఎక్కాయి. దీంతో వెంకట్రెడ్డి చెట్టుపైకి ఎక్కి తరిమే క్రమంలో గుర్రపు తేనెటీగలు లేచి వెంకట్ రెడ్డిపై దాడి చేశాయి.
దీంతో ఆయన చెట్టుపై నుంచి కింద పడటంతో తీవ్రగాయాలయ్యాయి. అక్కడే ఉన్న భార్య కుమారుడికి సైతం తేనెటీగలు దాడి చేయడంతో గాయాలయ్యాయి. వెంటనే మెరుగైన చికిత్స నిమిత్తం జహీరాబాద్ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ వెంకట్ రెడ్డి మృతిచెందాడు. అతడి భార్య, కుమారుడు చికిత్స పొందుతున్నారు.
ఇవి కూడా చదవండి..
భూమికి చేరిన స్పేస్ ఎక్స్ వాహక నౌక
Tragedy | చెరువులో పడి ఏడుగురు బాలికలు మృతి
Salman Khan: బిగ్ బాస్ షోకి భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న సల్మాన్ ఖాన్