మెదక్ : ప్రమాదవశాత్తు గుంతలో పడి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన చిన్నశంకరంపేటలో బుధవారం చోటు చేసుకుంది. చిన్నశంకరంపేటకు చెందిన కనకయ్య(19) అనే యువకుడు ఉదయం కాలకృత్యాలు తీర్చుకోవడానికి కుంట వద్దకు వెళ్లాడు.
కాలకృత్యాలు తీర్చుకుంటుండగా ప్రమాదవశాత్తు కుంటలో పడి కనకయ్య మృతి చెందాడు.
మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు చిన్నశంకరంపేట ఎస్సై మహ్మద్గౌస్ కేసు నమోదు చేసుకొని శవపంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా దవఖానాకు తరలించారు. కనకయ్య మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇవి కూడా చదవండి..
మూసీపై ఈనాడు నానాయాగి.. సుందరీకరణపై విషపు రాతలు
టీమిండియాకు విదేశీ కోచ్.. చాన్సే లేదంటున్న బీసీసీఐ!
వినూత్నంగా బర్త్డే సెలబ్రేషన్.. 550 కేక్స్ కట్ చేసిన వ్యక్తి