భువనగిరి అర్బన్, జూలై 29 : భువనగిరి పట్టణంలోని పహాడీ నగర్లో గల ఓ ఇంటిలో సోదాలు నిర్వహించగా గంజాయి నిల్వ ఉంచి విక్రయిస్తున్న మొహమ్మద్ అజమ్ ను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుండి సుమారు 22 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఎవరైనా అక్రమంగా గంజాయి, డ్రగ్స్ ని విక్రయించినా, నిల్వ ఉంచినా కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ డి. వేణుకుమార్ తెలిపారు. ఈ సోదాలలో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ రాధాకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.