మష్రూమ్స్: ఒక కప్పు, కాబూలీ శనగలు: ఒక కప్పు, వెల్లుల్లి: నాలుగు రెబ్బలు, తెల్ల నువ్వులు: రెండు టేబుల్ స్పూన్లు, ఆలివ్ ఆయిల్: అర కప్పు, మిరియాల పొడి: చిటికెడు, కారం: కొద్దిగా, కొత్తిమీర తురుము: కొద్దిగా, ఉప్పు: తగినంత, నిమ్మరసం: పావుకప్పు.
ముందుగా నువ్వులను దోరగా వేయించి రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. శనగలను కడిగి పది గంటలపాటు నానబెట్టి కుక్కర్లో వేసి నీళ్లుపోసి, తగినంత ఉప్పు వేసి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. నీళ్లు వంపిన శనగల్ని మిక్సీగిన్నెలో వేసి వెల్లుల్లి రెబ్బలు, రెండు టేబుల్ స్పూన్ల నూనె, నువ్వుల మిశ్రమం, నిమ్మరసం వేసి మెత్తగా, మృదువుగా అయ్యేంతవరకు గ్రైండ్ చేయాలి. స్టవ్మీద పాన్పెట్టి తరిగిన మష్రూమ్స్, కొద్దిగా ఉప్పువేసి సన్నని మంటపై వేయించాలి. మష్రూమ్స్ వేగుతుండగా ఒక టీస్పూన్ ఆయిల్, చిటికెడు ఉప్పు వేసి మరింత వేయించి దింపేయాలి. ఒక వెడల్పాటి గిన్నెలో శనగల మిశ్రమం పరిచి పైనుంచి ఉడికించిన శనగలు, ఒక టీస్పూన్ ఆలివ్ ఆయిల్, వేయించిన మష్రూమ్స్ వేసి మిరియాల పొడి, కారం చల్లాలి. చివరగా కొత్తిమీర, నిమ్మరసం చల్లుకుంటే నోరూరించే మష్రూమ్ హుమ్మస్ సిద్ధం.
Thunder Mushroom | ఈ పుట్టగొడుగులు ఎందుకంత స్పెషల్.. ఇవి అన్నిచోట్ల ఎందుకు దొరకవు?”