కావలసిన పదార్థాలు
మష్రూమ్స్: ఒక కప్పు, మైదా: పావుకప్పు, కార్న్ఫ్లోర్: పావుకప్పు, బియ్యపు పిండి: ఒక టేబుల్స్పూన్, కారం: ఒక టీస్పూన్, గరం మసాలా: అర టీస్పూన్, మిరియాల పొడి: పావు టీస్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్: అర టీస్పూన్, ఉప్పు: తగినంత.
తయారీ విధానం
ముందుగా మష్రూమ్స్ను కడిగి పొడవుగా తరిగి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో మైదా, కార్న్ఫ్లోర్, బియ్యపు పిండి, కారం, ఉప్పు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి జారుగా బజ్జీల పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు, తరిగిన మష్రూమ్స్ను పిండి మిశ్రమంలో వేసి బాగా కలపాలి. స్టవ్మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనె పోసుకుని, బాగా
వేడయ్యాక మష్రూమ్స్ను విడివిడిగా వేస్తూ దోరగా వేయించుకుంటే.. మష్రూమ్-65 రెడీ.