Black water | పీటర్ వాటర్, మినరల్ వాటర్, రోజ్ వాటర్.. ఇవన్నీ తరచూ వినిపించే పదాలే. కానీ బ్లాక్ వాటర్ గురించి ఎప్పుడైనా విన్నారా? ఈ మధ్యకాలంలో ఎక్కువగా బ్లాక్ వాటర్ గురించి వినిపిస్తుంది. సెలబ్రెటీలు ఈ వాటర్ తాగేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఈ బ్లాక్ వాటర్నే తెప్పించుకుని తాగుతున్నాడు. తాజాగా బాలీవుడ్ నటి మలైకా ఆరోరా సైతం ఈ బ్లాక్వాటర్నే తాగుతుంది. ఈ విషయం తెలియడంతో సోషల్ మీడియాలో బ్లాక్ వాటర్ గురించి ఇప్పుడు పెద్ద చర్చే జరుగుతోంది.
నిన్న మొన్నటి వరకు సెలబ్రిటీలు చాలా మంది ఎన్నో రకాల వాటర్ టేస్ట్ చేశారు. ఇప్పుడు సరికొత్తగా బ్లాక్ వాటర్ వైపు అడుగులు వేస్తున్నారు. ఈ బ్లాక్వాటర్ లీటర్కు 100 రూపాయలకు పైగానే ఉంటుంది. సాధారణంగా మనం తాగే మినరల్ వాటర్ ఖరీదు ఒక లీటర్కు 20 రూపాయల నుంచి 30 రూపాయల మధ్యలో ఉంటుంది. కానీ దానికి నాలుగింతలు ధరతో బ్లాక్ వాటర్ లభిస్తుంది. మరి అంత వ్యత్యాసం ఎందుకు ఉందంటే.. ఈ బ్లాక్ వాటర్తో అన్ని లాభాలు ఉన్నాయని అంటున్నారు. లీటర్ బ్లాక్ వాటర్లో 70 మినరల్స్ ఉంటాయి. అవి జీర్ణశక్తిని పెంపొందిస్తాయి. అలాగే అసిడిటీ ప్రాబ్లెం రాకుండా చూసుకుంటుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీవక్రీయను నియంత్రిస్తుంది. వీటన్నింటితో పాటు వయసు కనబడకుండా నిత్య యవ్వనంగా కనిపించేలా చేసే ప్రత్యేకమైన పోషకాలు కూడా ఈ నీటిలో ఉన్నాయంట. అందుకే సెలబ్రెటీలు ఈ నీటిని ఎక్కువగా తాగుతున్నారు.
విరాట్ కోహ్లీ, మలైకా అరోరానే కాదు.. సౌత్ హీరోయిన్ శృతిహాసన్ సైతం ఈ బ్లాక్వాటర్కు అభిమాని. వీళ్లు మాత్రమే కాకుండా ఇంకా చాలామంది సెలబ్రెటీలు కూడా ఈ బ్లాక్ వాటర్ను తాగుతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Bullettu Bandi Song|’బుల్లెట్టు బండి’ స్పందనపై వధూవరుల రియాక్షన్..వీడియో
భీమ్లా నాయక్లో రానా పాత్రను విలన్గా మార్చేస్తున్నారా?
జూనియర్ ఎన్టీఆర్ కచ్చితంగా సీఎం అవుతాడు.. టాలీవుడ్ నటుడి సంచలన వ్యాఖ్యలు
ఇంట్రెస్టింగ్ అప్డేట్..హీరోగా బండ్లగణేశ్..!
ముంబైలో మకాం.. సమంత స్పందన ఏంటి?