నటుడిగా కెరీర్ ప్రారంభించి..తెలుగు సినీ పరిశ్రమలో వన్ ఆఫ్ ది లీడింగ్ ప్రొడ్యూసర్లలో ఒకరిగా నిలిచారు బండ్ల గణేశ్ (Bandla Ganesh). సరిలేరు నీకెవ్వరు చిత్రంతో చాలా కాలం తర్వాత మళ్లీ ముఖానికి మేకప్ వేసుకున్నాడీ యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్. బండ్ల గణేశ్ ఈ సారి హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడన్న వార్త హాట్ టాపిక్ గా మారింది. తమిళంలో బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది ఒత్త సెరుప్పు సైజ్ 7 (Oththa Seruppu Size 7). క్రైం థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు.
ఆర్ పార్థీబన్ (ఒకే పాత్ర) R Parthiepan క్యారెక్టర్ చుట్టూ తిరిగే కథతో సినిమా తెరకెక్కింది. ఆర్ పార్థీబన్ కథనందించడమే కాకుండా సొంత బ్యానర్ లో ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. నేషనల్ ఫిల్మ్ అవార్డుల్లో..స్పెషల్ జ్యూరీ, ఉత్తమ ఆడియోగ్రఫీ విభాగంలో అవార్డులను అందుకుంది. వెంకట్ చంద్ర ఈ ప్రాజెక్టును డైరెక్ట్ చేయబోతున్నాడు. పార్థీబన్ పాత్రలో బండ్ల గణేశ్ కనిపించనున్నాడని సమాచారం.
యశ్ రిషీ ఫిలిమ్స్ బ్యానర్ పై స్వాతి చంద్ర ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఆసక్తికర విషయమేంటంటే ఇదే చిత్రాన్ని హిందీలో అభిషేక్ బచ్చన్ లీడ్ రోల్ లో తెరకెక్కిస్తుండగా..పార్థీబన్ డైరెక్ట్ చేస్తున్నాడు. చెన్నైలో షూటింగ్ మొదలైంది.
ఇవికూడా చదవండి..
Raashi Khanna | రాశీఖన్నాకు మారుతి ఆశీర్వచనాలు..ట్రెండింగ్ లో స్టిల్
Samantha Akkineni | పాండిచ్చేరికి సమంత పయనం..!
Sunitha | డబ్బు కోసం రామ్ను పెళ్లి చేసుకున్నానంటున్నారు..!