తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన ఓ మై కడవులే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. యువ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్నాడు. బాలీవుడ్ నటి మిథిలా పాల్కర్ ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఒరిజినల్ వెర్షన్ లో రితికాసింగ్ పోషించిన ఫీమేల్ లీడ్ రోల్లో మిథిలా పాల్కర్ కనిపించనుంది. ఇవాళ సాయంత్రం విశ్వక్ సేన్ ఈ చిత్రానికి సంబంధించి ఓ అప్ డేట్ ను ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకున్నాడు.
అద్బుతమైన టాలెంట్ కలిగిన టీంతో 18 రోజుల షూటింగ్ ముగిసింది. 3 రోజుల స్వల్ప విరామం తర్వాత మళ్లీ సెట్స్ లో కలుద్దాం అంటూ టీంతో దిగిన ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు విశ్వక్ సేన్. తమిళ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన అశ్వథ్ మారిముత్తు తెలుగు రీమేక్ ను కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. పీవీపీ సినిమాస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
బాలకృష్ణను భయపెట్టేది ఏంటో తెలుసా..?
నారప్పలో ఆ విషయం వివాదమయ్యేనా?
‘బంగార్రాజు’కు కృతిశెట్టి రెమ్యునరేషన్ ఎంతంటే..?
నటి కరీనా కపూర్ పుస్తకం ‘ప్రెగ్నెన్సీ బైబిల్’పై ఫిర్యాదు
నటి ఖుష్బూ ట్విటర్ అకౌంట్ మళ్లీ హ్యాక్
రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్.. వీడియోలు ఎక్కడ తీశారు? ఎలా అప్లోడ్ చేశారు?