Aishwarya Rajinikanth | తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ (Aishwarya Rajinikanth) కొత్త ఇంటిని కొనుగోలు చేశారు. హీరో ధనుష్తో విడిపోయిన తర్వాత ఐశ్వర్య తన తల్లిదండ్రుల వద్దే ఉంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవలే సొంతంగా ఓ ఇంటిని కొనుగోలు చేసి (Aishwaryas new house) అక్కడికి షిఫ్ట్ అయ్యారు. ఆ ఇంటికి తాజాగా రజనీకాంత్ తన భార్య లతతో కలిసి వెళ్లారు.
ముందుగా ఇంట్లోకి వెళ్లిన రజనీకాంత్ దంపతులు అక్కడ దేవుడి దగ్గర దీపం వెలిగించారు. అనంతరం ఇళ్లంతా కలియతిరిగారు. ఈ సందర్భంగా కూతురి ఇంటిని చూసి సూపర్ స్టార్ మురిసిపోయారు. రజనీకాంత్ రియాక్షన్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఐశ్వర్య రజనీకాంత్కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అదే విధంగా కొత్త ఇంట్లో ఐశ్వర్యకు అంతా శుభమే జరగాలని కోరుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Superstar #Rajinikanth and wife #LataRajinikanth attend #AishwaryaRajinikanth‘s house warming ceremony#SDFilmyNews pic.twitter.com/AE1CMff5RH
— SD Filmy News (@SDFilmyNews) May 3, 2024
కాగా, సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్దకుమార్తె అయిన ఐశ్వర్య.. 2004 నవంబర్ 18న ధనుష్ను వివాహం చేసుకుంది. వీరికి యాత్ర, లింగ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే, ఈ జంట తాము విడిపోతున్నట్లు 2022 జనవరిలో ప్రకటించింది. 18 ఏళ్ల బంధానికి ముగింపు పలుకుతున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఇద్దరూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ‘18 ఏళ్లపాటు స్నేహితులుగా, భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా, శ్రేయోభిలాషులుగా అర్థం చేసుకొని మా ప్రయాణం కొనసాగించాం. ఇప్పుడు మేము వేరువేరు దారుల్లో ప్రయాణించేందుకు సిద్ధమయ్యాం. మేమిద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నాం’ అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రకటన చేశారు. ఇక అప్పటి నుంచి ఇద్దరూ విడివిడిగానే ఉంటున్నారు. డివోర్స్ ప్రకటన తర్వాత ఐశ్వర్య తన తల్లిదండ్రుల వద్దకు వచ్చేసింది. ఇక అప్పటి నుంచి తండ్రి వద్దే ఉన్న ఐశ్వర్య ఇప్పుడు కొత్తగా ఇంటిని కొనుగోలు చేసి అక్కడికి షిఫ్ట్ అయ్యారు.
Also Read..
School Principal | స్కూల్కు లేట్గా వచ్చిందని.. టీచర్పై దాడి చేసిన లేడీ ప్రిన్సిపాల్
Karnataka | ప్రియురాలితో పారిపోయిన కొడుకు.. తల్లిని విద్యుత్ స్తంభానికి కట్టేసి..
Congresss | హస్తం పార్టీకి మరో షాక్.. ఎన్నికల ప్రచారానికి నిధులు ఇవ్వకపోవడంతో పోటీకి నిరాకరణ