Congresss | లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ (Congresss) పార్టీకి దెబ్బమీద దెబ్బ పడుతోంది. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ అభ్యర్థులు ఎన్నికల పోటీ నుంచి తప్పుకుని వేరే పార్టీల్లోకి చేరిన విషయం తెలిసిందే. తాజాగా హస్తం పార్టీకి మరో షాక్ తగిలింది. నిధుల కొరతతో ( No funds) మరో అభ్యర్థి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిరాకరించారు. ఈ మేరకు తనకు ఇచ్చిన టికెట్ను వెనక్కి ఇచ్చేశారు.
ఒడిశాలోని పూరి లోక్సభ (Puri candidate) స్థానానికి హస్తం పార్టీ సుచిత్ర మొహంతి (Sucharita Mohanty)ని బరిలోకి దింపిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఆమె ఎన్నికల్లో పోటీ చేయలేనని తెగేసి చెప్పారు. ఎన్నికల ప్రచారానికి పార్టీ అధిష్టానం ఎలాంటి ఆర్థిక సాయం అందించడం లేదని, నిధుల కొరతతో ఇబ్బందిగా ఉందని తెలిపారు. పబ్లిక్ డొనేషన్ డ్రైవ్, ఖర్చును తగ్గించడం వంటి ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేదని పేర్కొన్నారు. నిధులు లేకుండా ఎన్నికల ప్రచారం అసాధ్యమన్నారు. అందుకే ఎన్నికల్లో పోటీ చేయడానికి నిరాకరించినట్లు చెప్పారు. ఈ మేరకు టికెట్ను తిరిగి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్కు రాసిన లేఖలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ‘నాకు నిధులు ఇవ్వడానికి పార్టీ నిరాకరించింది. దీంతో ఎన్నికల ప్రచారం ఇబ్బందిగా మారింది. నిధులు లేకుండా ఎన్నికల ప్రచారం అసాధ్యం. ఈ విషయాన్ని ఒడిశా కాంగ్రెస్ ఇన్చార్జ్ డాక్టర్ అజోయ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లా.. ఆయన కూడా ప్రచార నిధులు మీరే సమకూర్చుకోండి అని స్పష్టంగా చెప్పారు. నేను 10 సంవత్సరాల క్రితం రాజకీయాల్లోకి వచ్చా. వృత్తిరీత్యా జర్నలిస్ట్ని. పూరీలో ఎన్నికల ప్రచారానికి నా వద్ద ఉన్నదంతా ఇచ్చాను. ప్రగతిశీల రాజకీయాల కోసం ప్రజా విరాళ యాత్రను నిర్వహించాను. కానీ పెద్దగా విజయం సాధించలేదు. నేను అంచనా వేసిన ప్రచార వ్యయాన్ని కూడా కనిష్టంగా తగ్గించడానికి ప్రయత్నించాను. అయినా ఎలాంటి ఫలితమూ లేదు. ఇతర పార్టీలు మాత్రం నిధిలు నిండుగా ఉండటంతో ప్రచారంలో దూసుకెళ్తున్నారు’ అని లేఖలో ఆమె పేర్కొన్నారు.
Also Read..
Accident | విషాదాంతమైన విహారయాత్ర.. కారు ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు మృతి
Karnataka | ప్రియురాలితో పారిపోయిన కొడుకు.. తల్లిని విద్యుత్ స్తంభానికి కట్టేసి..
Death Threat | రాజస్థాన్ మంత్రికి హత్యా బెదిరింపులు