Venu Madhav | టాలీవుడ్లో ఫేవరేట్ కమెడియన్ ఎవరని అడిగితే చాలామంది బ్రహ్మానందం పేరు చెబుతారు. బ్రహ్మీ తర్వాత మాత్రం చాలామంది నోటి నుంచి వినిపించే పేరు వేణుమాధవ్. మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టి ఇండస్ట్రీలో టాప్ కమెడియన్గా ఎదిగాడు. కానీ అనారోగ్యంతో ఆకస్మాత్తుగా మరణించాడు. ఆయన మరణం అప్పట్లో అందర్నీ దిగ్భ్రాంతికి గురిచేసింది. వేణుమాధవ్ మరణం తర్వాత అతని కుటుంబ సభ్యులు మీడియాకు దూరంగా ఉన్నారు. కానీ ఇప్పుడు దాదాపు మూడున్నరేళ్ల తర్వాత వేణుమాధవ్ తల్లి సావిత్రమ్మ ఓ యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో వేణుమాధవ్ గురించి పలు సంచలన విషయాలను బయటపెట్టింది.
‘ నా ముగ్గురు కొడుకుల్లో వేణు మాధవ్ చిన్నవాడు. చిన్నతనం నుంచి చాలా చురుగ్గా ఉండేవాడు. మిమిక్రీ బాగా చేసేవాడు. మిమిక్రీ ఆర్టిస్టుగా ఓ ప్రోగ్రామ్ చేస్తున్న టైమ్లోనే ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చి రెడ్డి చూసి సినిమా అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత నటుడిగా ఎదిగాడు. నటుడిగా పేరు తెచ్చుకోవడం చూసి చాలా గర్వపడ్డా. తను సినిమాలతో బిజీగా ఉండటంతో ఇద్దరు కొడుకులను తనకు అసిస్టెంట్గా పెట్టా. కానీ అలా ఎందుకు చేశానా అని ఇప్పుడు బాధపడుతున్నా. నా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు అదే. వేణు ఎదిగాడు.. వాళ్లిద్దరు ఎదగలేదు.’ అని సావిత్రమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. ఒకవేళ వేణు ఉండి ఉంటే వాళ్లందరినీ చూసుకునేవాడేమో అని అభిప్రాయం వ్యక్తం చేసింది.
‘ వేణు మాధవ్ తన ఆరోగ్యాన్ని చేజేతులా పాడుచేసుకున్నాడు. ఏ జబ్బు చేసినా వేణు మందులు వేసుకునేవాడు కాదు. తొలనొప్పి వచ్చినా ట్యాబ్లెట్ వేసుకునే అలవాటు లేదు. అదే కొంపముంచింది. జాండీస్, డెంగీ వ్యాధులు వస్తే మందులు వాడకుండా నిర్లక్ష్యం చేశాడు. దాంతో పరిస్థితి విషమించి చనిపోయాడు. వేణు చనిపోవడానికి నెల రోజుల ముందే పెద్ద కొడుకు కూడా పోయాడు. ఇద్దరి మరణాలు చూసి కుంగిపోయా.’ అని చెప్పింది.
వేణుమాధవ్ ఆస్తులు బాగానే సంపాదించాడని అతని తల్లి సావిత్రమ్మ చెప్పింది. ఏడు ఎనిమిది ఫ్లాట్లు కొన్నాడని తెలిపింది. వేణు ఆస్తుల విలువ 20 కోట్లు ఉంటాయని పేర్కొంది. వేణుమాధవ్కు ఇద్దరు కొడుకులు అని.. వాళ్లు సొంత ఇంట్లోనే ఉంటున్నారని చెప్పింది. తాను మాత్రం తన మూడో కొడుకు దగ్గర కిరాయి ఇంట్లో ఉంటున్నానని బాధపడింది.
Tarakaratna | ఐసీయూలో నందమూరి తారకరత్న.. వైరల్ అవుతున్న ఫొటో
RRR | అవార్డులకు కేరాఫ్ అడ్రస్గా ఆర్ఆర్ఆర్.. ఖాతాలో మరో పురస్కారం