Tarakaratna | నందమూరి తారకరత్న ఆరోగ్యంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. కుప్పంలో నారా లోకేశ్ చేపట్టిన యువగళం యాత్రలో గుండెపోటుతో కుప్పకూలిన తారకరత్న.. ఇంకా స్పృహలోకి రాలేదు. ఆయన్ను కాపాడేందుకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ వైద్యులు అహర్నిశలు కృషి చేస్తున్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు నందమూరి కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తున్నారు. అలాగే హెల్త్ బులిటెన్ విడుదల చేస్తున్నారు. తారకరత్న కోలుకుంటున్నాడని అందరూ చెబుతున్నప్పటికీ.. ఫ్యాన్స్ మనసులో ఇంకా ఏదో ఆందోళన ఉంది. ఏదో దాస్తున్నారని అంతా అనుకుంటున్నారు. ఈ క్రమంలో ఐసీయూలో చికిత్స పొందుతున్న తారకరత్న ఫొటో ఒకటి ఇప్పుడు బయటకొచ్చింది.
ఐసీయూలో బెడ్పై ఉన్న తారకరత్న ఫొటోలను చూసి అభిమానులు చలించిపోతున్నారు. ఇలా చలనం లేకుండా పడి ఉండటం చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని.. త్వరగా కోలుకుని తిరిగిరా అన్నా అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తారకరత్న ఆరోగ్యం క్రమంగా మెరుగవుతున్నట్టు ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు. సోమవారం చేసిన సిటీ స్కాన్ రిపోర్టులో డాక్టర్లు కీలక విషయాలు గుర్తించినట్టు తెలుస్తోంది. గుండె సక్రమంగా పనిచేయకపోవడంతో తగినంత ఆక్సిజన్ అందకపోవడంతో బ్రెయిన్కు ఎఫెక్ట్ అయినట్టు గుర్తించారు. బ్రెయిన్ డ్యామెజీ రికవరీపై వైద్య నిపుణులు ఫోకస్ పెట్టారని సమాచారం.
తారకరత్న ఆరోగ్యంపై మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించారు. ‘ సోదరుడు తారకరత్న త్వరగా కోలుకుంటున్నారు. ఇంకా ఏ ప్రమాదం లేదని మాట ఎంతో ఉపమశనం ఇచ్చింది. తను త్వరలో పూర్తిస్థాయిలో కోలుకుని ఇంటికి తిరిగిరావాలని కోరుకుంటూ.. ఈ పరిస్థితి నుంచి కాపాడిన డాక్టర్లకు కృతజ్ఞతలు’ అంటూ ట్వీట్ చేశాడు
తారకరత్న పరిస్థితి విషమంగా ఉందన్న మాట వాస్తవమే కానీ అతనికి ఎక్మో సపోర్ట్ పెట్టలేదు. వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు నారాయణ హృదయాలయ వైద్యులు వెల్లడించారు. అంతకుముందు నందమూరి రామకృష్ణ కూడా ఇదే విషయం చెప్పారు. తారకరత్న సొంతంగా ఊపిరి తీసుకుంటున్నారని.. క్రమక్రమంగా కోలుకుంటున్నాడని చెప్పారు. మీ అందరి ఆశీస్సులతో తొందరగానే కోలుకుంటారని ఆశిస్తున్నట్టు చెప్పారు.
కుప్పం జిల్లాలో శుక్రవారం నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రారంభోత్సవంలో నందమూరి తారకరత్న పాల్గొన్నారు. యాత్ర ప్రారంభమైన కాసేపటికి సమీపంలో ఉన్న మసీదులోకి నారా లోకేశ్ వెళ్లారు. లోకేశ్తో పాటు తారకరత్న కూడా మసీదులోకి వెళ్లారు. ఆ సమయంలో టీడీపీ కార్యకర్తలు అంతా గుంపుగా తరలివచ్చారు. అందరూ ఒక్కసారిగా మీద పడ్డట్టు రావడంతో తారకరత్నకు ఊపిరి ఆడలేదు. ఇదే విషయాన్ని సిబ్బందికి చెప్పడంతో వాళ్లు.. టీడీపీ కార్యకర్తలను దూరంగా వెళ్లాలని సూచించారు. అయినప్పటికీ వాళ్లు వినిపించుకోలేదు. ఈ క్రమంలో ఊపిరాడక తారకరత్న సొమ్మసిల్లి పడిపోయాడు. వెంటనే ఆయనకు ప్రాథమిక చికిత్స అందించి కుప్పం ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు తీవ్ర గుండెపోటుగా నిర్ధారించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రత్యేక అంబులెన్స్ ద్వారా బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
RRR | అవార్డులకు కేరాఫ్ అడ్రస్గా ఆర్ఆర్ఆర్.. ఖాతాలో మరో పురస్కారం