Allu Arha in Shaakutalam Movie | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ ‘శాకుంతలం’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమాలో భరత యువరాజు పాత్రలో అర్హ కనిపించనుంది. ఇటీవలే రిలీజైన ట్రైలర్లో అర్హ సింహంపై స్వారీ చేస్తున్న క్లిప్ ట్రైలర్కే హైలేట్గా నిలిచింది. ఇన్ని రోజులు ఇన్స్టాగ్రామ్లో అల్లరి వీడియోలు, ఫోటోలతో అలరించిన అర్హ ఇప్పుడు బిగ్ స్క్రీన్ పై కనిపించనుండడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. కాగా తాజాగా ఈ సినిమాలో అర్హ స్క్రీన్టైమ్ గురించి గుణశేఖర్ అభిమానులతో పంచుకున్నాడు.
ఈ సినిమాలో అల్లు అర్హ పాత్ర ఆరు నిమిషాలు ఉండనుందట. రెండున్నర గంటల సినిమాలో ఆరు నిమిషాలు అర్హ పాత్ర ఉండడం విశేషమే. దీన్ని బట్టి చూస్తే అర్హ క్యారెక్టర్కు సినిమాలో ఎంత మంచి స్కోప్ ఉందో తెలుస్తుంది. ఇక ఇప్పటికే అర్హకు అవకాశాలు క్యూ కడుతున్నాయని సమాచారం. మహేష్- త్రివిక్రమ్ సినిమాలో అర్హ ఓ రోల్ చేయబోతుందని టాక్. ఇక తాజాగా పవన్ ‘ఉస్తాద్ భగత్సింగ్’లో ఓ కీలక పాత్ర కోసం అర్హను ఎంపిక చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. కాగా ఈ సినిమా ‘తేరీ’ మూవీకి రీమేక్గా తెరకెక్కుతన్నట్లు గతకొంత కాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కాగా తేరిలో విజయ్ కూతురుగా నటీ మీనా కుమార్తే నటించింది. ఇప్పుడు అదే పాత్రను అర్హతో చేయిస్తారని తెలుస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇక శాకుంతలం విషయానికొస్తే.. గుణశేఖర్ దర్శకత్వ వహించిన ఈ సినిమా మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. మలయాళ నటుడు దేవ్ మోహన్ కీలకపాత్ర పోషిస్తు్న్నాడు. దిల్రాజు సమర్పణలో గుణ టీంవర్క్స్ బ్యానర్పై నీలిమాగుణ అత్యంత భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మించింది. ఈ సినిమాను గుణశేఖర్ రుద్రమదేవి తర్వాత దాదాపు ఏడేళ్లు గ్యాప్ తీసుకొని రూపొందించాడు.