తెలుగు ఓటీటీ ప్లాట్ఫాం (Aha OTT) ‘ఆహా’ టాలీవుడ్ (Tollywood)నటుడు నందమూరి బాలకృష్ణ (Balakrishna)హోస్ట్గా టాక్ షో (Aha talk show) చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే (Unstoppable) షో ప్రోమోను కూడా విడుదల చేశారు. తాజాగా ఈ టాక్ షోకు సంబంధించిన ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. బాలకృష్ణను డైరెక్ట్ చేసే అరుదైన అవకాశం టాలీవుడ్ యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ కొట్టేశాడన్న వార్త టాలీవుడ్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. ఈ టాక్ షో ప్రోమోను ప్రశాంత్ వర్మనే డైరెక్ట్ చేశాడని టాలీవుడ్ సర్కిల్ సమాచారం.
ప్రశాంత్ వర్మ సినిమాల్లోకి రాకముందు ఫుల్టైమ్ యాడ్ ఫిల్మ్ మేకర్గా పనిచేశాడు. కింగ్ నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న బిగ్ బాస్ సీజన్ 5 షో ప్రోమోను ప్రశాంత్ వర్మనే డైరెక్ట్ చేశాడు. ఈ ప్రోమో నచ్చడంతో ఆహా యాజమాన్యం బాలకృష్ణ టాక్ షో కోసం ప్రశాంత్ వర్మ బోర్డుపైకి తీసుకొచ్చిందని టాక్. కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో సినిమాలు చేసే ప్రశాంత్ వర్మకు ఫ్యాన్ ఫాలోయింగ్ సినిమాలపరంగానే కాదు టీవీ ప్రేక్షకులు కూడా చాలా మందే ఉన్నారు.
ప్రశాంత్ వర్మ ప్రస్తుతం టాలీవుడ్ తొలి సూపర్ హీరో ఫిల్మ్ హను మాన్ చేస్తున్నాడు. యువ నటుడు తేజ సజ్జా హీరోగా నటిస్తున్నాడు. ఈ టాక్ షోకు ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు అతిథులుగా రాబోతున్నట్టు తెలుస్తోంది. తొలి గెస్టులుగా మంచు మోహన్ బాబు కుటుంబం (Manchu family) రాబోతుందని సమాచారం. ఇప్పటివరకు సినిమాలతో అలరించిన బాలకృష్ణ డిజిటల్ ప్లాట్ఫాంలో ఎలా ఎంటర్ టైన్ చేస్తాడో చూడాలి.
ఇవి కూడా చదవండి..
Chiranjeevi | మా ఎన్నికల ఫలితాలపై చిరంజీవి సెన్సేషనల్ కామెంట్స్
Divorce: విడాకులకి సిద్ధమవుతున్న మరో తెలుగు హీరో..నిజమెంత?
Tollywood | ‘మా’ ఎన్నికల పోలింగ్ లో కనిపించని తారలు వీళ్లే
Pragya Jaiswal: ప్రగ్యాకి కరోనా.. టెన్షన్లో బాలయ్య అభిమానులు