‘మా’ ఎన్నికల (Maa Elections) పోలింగ్ ముగిసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి మా ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ సారి మాత్రం గతంలో లేనంతగా అత్యధికంగా 75 శాతం పోలింగ్ నమోదైంది. కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రధానంగా ప్రకాశ్ రాజ్ (Prakash Raj), మంచు విష్ణు (Manchu Vishnu) గట్టి పోటీ నెలకొంది. వివిధ ప్రాంతాల్లో ఉన్న ‘మా’ మెంబర్స్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే టాలీవుడ్ స్టార్ హీరోహీరోయిన్లు మాత్రం పోలింగ్ కు హాజరు కాలేదు.
టాలీవుడ్ (Tollywood) హీరోలు వెంకటేశ్ (Venkatesh), (Mahesh Babu), మహేశ్బాబు, అల్లు అర్జున్, రానా, ఎన్టీఆర్, ప్రభాస్, నితిన్, రవితేజ, నాగచైతన్య పోలింగ్ కు రాలేదు. మరోవైపు హీరోయిన్లు త్రిష, ఇలియానా, అనుష్క, సమంత, రకుల్ ప్రీత్ సింగ్, హన్సిక కూడా పోలింగ్ లో కనిపించలేదు. అయితే టాలీవుడ్ హీరోహీరోయిన్లు తమకు ఆసక్తి లేక ఓటింగ్ కు రాలేదా..? లేదా తమ తమ బిజీ షెడ్యూల్స్ వల్ల ఓటింగ్ లో పాల్గొనలేకపోయారా..? అన్నది మాత్రం సస్పెన్స్ గానే ఉంది.
‘మా’ ఎన్నికల కోసం సీనియర్ నటి జయప్రద ఢిల్లీ నుంచి, నటి జెనీలియా ముంబై నుంచి హైదరాబాద్ కు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడం విశేషం. మరోవైపు ప్రియమణి, స్నేహాఉల్లాల్ ఇతర నటీనటులు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.
ఇవి కూడా చదవండి..
మా ఎన్నికల్లో గొడవలపై శివాజీ రాజా సంచలన వ్యాఖ్యలు.. గొడవలు ఆగాలంటే..
Pragya Jaiswal: ప్రగ్యాకి కరోనా.. టెన్షన్లో బాలయ్య అభిమానులు
Vijay Devarakonda: తిరుమలలో ఫ్యామిలీతో ప్రత్యక్షం అయిన విజయ్ దేవరకొండ