కంచె చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న అందాల ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలకృష్ణతో కలిసి అఖండ చిత్రం చేస్తుంది. ఇందులో ప్రగ్యా పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నట్టు సమాచారం. అయితే ఇటీవల బాలయ్యతో కలిసి సంతోషంగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు కరోనా బారిన పడింది. స్వయంగా ప్రగ్యానే ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
ఆదివారం నేను కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యాను. ఆల్రెడీ నేను రెండు డోసులు వాక్సిన్ తీసుకున్నా, ఇంతకముందు కరోనా బారిన పడ్డా మళ్లీ కరోనా వచ్చింది . ప్రస్తుతం నేను ఐసోలేషన్ లో ఉన్నాను, లాస్ట్ 10 రోజుల్లో నన్ను ఎవరైతే కలిసారో వారంతా కూడా దయచేసి జాగ్రత్తగా ఉండాలని” ప్రగ్యా సూచించింది. అయితే ప్రగ్యాకి కరోనా సోకడం పట్ల బాలయ్య ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.
హైదరాబాద్లో ఇటీవల సాంగ్ చిత్రీకరణతో మొత్తం షూటింగ్ పూర్తయిన సందర్భంగా చిత్రయూనిట్ అంతా కలిసి పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీలో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచిన బాలకృష్ణ.. తన హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్తో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. అయితే పార్టీలో బాలయ్యతో ప్రగ్యా చాలా సన్నిహితంగా ఉండడం వలన అతనికి ఏమైన కరోనా సోకి ఉంటుందేమోనన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.