టాలీవుడ్ (Tollywood) హీరో అల్లు అర్జున్ (Allu Arjun) చేస్తున్న తాజా సినిమా పుష్ప (Pushpa). సుకుమార్ (Sukumar) డైరెక్షన్ లో ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ (DEVI SRI PRASAD) సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో శ్రీవల్లి పాటకు సంబంధించిన ఆసక్తికర అప్ డేట్ ఇస్తూ ఓ వీడియో షేర్ చేశాడు డీఎస్పీ. స్టూడియోలో డీఎస్పీ మ్యూజిక్ ప్లే చేస్తుంటే..పక్కనే ఉన్న గాయకుడు సిద్ శ్రీరామ్ (Sid Sriram)చూపే బంగారమాయెనే శ్రీవల్లి..మాటే మాణిక్యమాయనే అంటూ పాట పాడుతున్నాడు.ఈ పాటను అక్టోబర్ 13న ఉదయం 11.07 గంటలకు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ పాటను సిద్ శ్రీరామ్ పాడటం విశేషం. మెలోడీయెస్ గా సాగుతున్న ఈ పాటు సినిమాకే హైలెట్ గా నిలుస్తుందనండలో ఎలాంటి సందేహం లేదని..మైత్రీ మూవీ మేకర్స్, డీఎస్పీ షేర్ చేసిన తాజా వీడియోల ద్వారా తెలిసిపోతుంది.
శ్రీవల్లీ హిందీ వెర్షన్ ను ప్రముఖ గాయకుడు జావెద్ అలీ పాడారు. పుష్ప చిత్రాన్ని డిసెంబర్ 17న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Tollywood | ‘మా’ ఎన్నికల పోలింగ్ లో కనిపించని తారలు వీళ్లే
మా ఎన్నికల్లో గొడవలపై శివాజీ రాజా సంచలన వ్యాఖ్యలు.. గొడవలు ఆగాలంటే..
Pragya Jaiswal: ప్రగ్యాకి కరోనా.. టెన్షన్లో బాలయ్య అభిమానులు
Vijay Devarakonda: తిరుమలలో ఫ్యామిలీతో ప్రత్యక్షం అయిన విజయ్ దేవరకొండ