ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 5 : బాబు జగ్జీవన్రామ్ జయంతిని సోమవారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఇబ్రహీంపట్నం మార్కెట్ యార్డు సమీపంలోని జగ్జీవన్రామ్ విగ్రహానికి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ స్రవంతి, ఎంపీపీ కృపేశ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి, వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, మాజీ మున్సిపల్ చైర్మన్ భరత్కుమార్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు భరత్రెడ్డి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు మంఖాల దాసు, చిలుకల బుగ్గరాములు, జెర్కోని రాజు నివాళులర్పించారు.
సేవలు చిరస్మరణీయం…
ఆమనగల్లు, ఏప్రిల్ 5 : మాడ్గుల మండలంలోని అందుగుల గ్రామంలో జగ్జీవన్రామ్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆమనగల్లు మున్సిపాలిటీ కార్యాలయం ఆవరణలో చైర్మన్ రాంపాల్నాయక్, వైస్ చైర్మన్ దుర్గయ్య, కమిషనర్ శ్యామ్సుందర్, కౌన్సిలర్లు జయంతి వేడుకలో పాల్గొన్నారు.
కడ్తాల్లో..
కడ్తాల్ ఏప్రిల్ 5 : సమాజంలో ప్రతి ఒక్కరూ జగ్జీవన్రామ్ అడుగుజాడల్లో నడువాలని జడ్పీటీసీ దశరథ్నాయక్ అన్నారు. పట్టణంలో టీఆర్ఎస్, కాంగ్రెస్, యువజన, కుల సంఘాల ఆధ్వర్యంలో జగ్జీవన్రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, టీపీసీసీ సభ్యుడు శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు.
ఆశయ సాధనకు కృషి చేయాలి..
యాచారం, ఏప్రిల్ 5 : యాచారం, నందివనపర్తి, తులేఖుర్ధు గ్రామాల్లో జగ్జీవన్రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ సుకన్య, జడ్పీటీసీ జంగమ్మ, సర్పంచ్లు బండిమీది కృష్ణ, శ్రీనివాస్రెడ్డి, ఎంపీటీసీ శివలీల పాల్గొన్నారు.
మంచాలలో నాయకుల నివాళి..
మంచాల ఏప్రిల్ 5 : మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చీరాల రమేశ్, ప్రధాన కార్యదర్శి బహదూర్, ఎంపీపీ నర్మద, సహకార సంఘం చైర్మన్ పుల్లారెడ్డి, నాయకులు అనిరెడ్డి శ్రీలక్ష్మి, ఏర్పుల చంద్రయ్య జగ్జీవన్రామ్ చిత్రపటానికి నివాళులర్పించారు.
తుర్కయాంజాల్లో జయంతి వేడుకలు
తుర్కయాంజాల్, ఏప్రిల్ 5 : మున్సిపాలిటీ కార్యాలయంలో చైర్పర్సన్ మల్రెడ్డి అనురాధ, కమిషనర్ అహ్మద్ షఫీ ఉల్లా కౌన్సిలర్లతో కలిసి జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మునగనూర్లో జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షుడు దోమలపల్లి గోపాల్, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు దోమలపల్లి రమేశ్ సంయుక్త ఆధ్వర్యంలో కౌన్సిలర్లు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి నివాళులర్పించారు.
అబ్దుల్లాపూర్మెట్లో ఘనంగా జయంతి..
అబ్దుల్లాపూర్మెట్, ఏప్రిల్ 5 : మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పూజారి చక్రవర్తిగౌడ్ జగ్జీవన్రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఇవీ కూడా చదవండి…
ఒక్క గ్రామానికి ఏడాదికి 3.37 కోట్లు
అద్భుత చరిత్రకు నాంది : ఎమ్మెల్సీ కవిత