పెద్దమందడి, మే 8 : ‘తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక పదేళ్ల కేసీఆర్ పాలన, కాంగ్రెస్ ఐదు నెలల పా లన మీ కండ్ల ముందే కనిపిస్తుంది.. కేసీఆర్ సంక్షేమమైతే.. కాంగ్రెస్ క్షామం’అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని దొడగుంటపల్లి, పామిరెడ్డిపల్లిలో ఎంపీ ఎ న్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. పదేండ్ల లో కేసీఆర్ ఇచ్చిన హామీలతో పాటు చెప్పని పనులు కూడా చేశారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అమలు కా ని హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఆ తర్వాత గ్యారెంటీల అమలును విస్మరించిందన్నారు. ప్రజలు మరోసారి కాం గ్రెస్ మాయలో పడి మోసపోవద్దని సూచించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే ప్రజలకు అండగా ఉంటామన్నారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో బుద్ధిచెప్పాలన్నారు. ఆరు నెలల్లో ఆరు లోకాలు చూ పిస్తున్నారని ప్రజలే స్వయంగా చెబుతున్నారన్నారు. ఐదేండ్లుగా ఎండిపోని చెరువులు, కుంటలు ఇప్పుడెందుకు ఎండిపోయామని ప్రశ్నించారు. ‘రిజర్వాయర్లలో నీళ్లున్నా పంటలు ఎండిపోవడానికి కారకులెవరు? నీళ్లు తీసుకొచ్చే సోయిలేక పంటలను ఎండబెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీది’ అని విమర్శించారు. ఏ పార్టీ మంచి చేసింది? ఏ పార్టీ ఇబ్బందులకు గురి చేస్తుందని ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సూ చించారు. కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. అ నంతరం ఉపాధి కూలీలతో కలిసి గంపను నెత్తిన మోస్తూ ప్రచారం చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి, నాయకులు వేణుయాదవ్, రాజాప్రకాశ్రెడ్డి, మన్యపురెడ్డి, దయాకర్, నాగేంద్రరావు, శ్రీనివాస్రెడ్డి, జానకీరాములు, చిన్నారెడ్డి, లక్ష్మణ్గౌడ్, వెంకటేశ్వర్రెడ్డి, చెన్నయ్య, సురేశ్, గోవర్ధన్రెడ్డి, శ్రీ నివాస్యాదవ్, కార్యకర్తలు తదితరులున్నారు.