మక్తల్ టౌన్ మే 8 : ఉద్యమం నుం చి పుట్టుకొచ్చిన పార్టీ బీఆర్ఎస్ అని, ఉడు త బెదిరింపులకు భ యపడే ప్రసక్తే లేదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మక్తల్ మాజీ ఎమ్మె ల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అధ్యక్షతన మరికల్ మండలం జిన్నారంలో ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డితో కలిసి హా జరై మాట్లాడారు. గ్రా మాల పరిధిలో నిర్మించిన ఇథనాల్ కంపెనీ యజమాన్యం రైతు లు, బీఆర్ఎస్ కార్యకర్తలపై పెడుతున్న కేసులకు వెనుకడుగు వేసేది లేదన్నారు. రైతుల పక్షాన నిలిచిపోరాటం చేయాలన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో కారుగుర్తుపై ఓటు వేసి ఎంపీగా మ న్నెను మరోసారి గెలిపించాలని కోరారు. అమలు కాని హామీల తో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని విస్మరించి పరిపాలన చేతగాక వ్యక్తిగత విమర్శలతో పబ్బం గడుపుతున్నదని విమర్శించారు. నాలుగు నెలల్లోనే పాలమూరును ఎడారి చేశారని, మరోసారి నమ్మి ఓటేస్తే తెలంగాణను నట్టేట ముంచడం ఖాయమన్నారు. పదేండ్ల అభివృద్ధి, నాలుగు నెలల కష్టాలు ప్రజల కళ్ల ముందు కనబడుతుందని, ఆలోచించి ఓటు వేయాలన్నారు.
మరికల్ మండలంలో నిర్మించిన ఇథనాల్ కంపెనీకి, బీఆర్ఎస్కు ఎలాంటి సంబంధం లేదని, రైతులకు ఇబ్బందులు కలిగితే సహించేది లేదని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. జిన్నారం, కన్మనూరు, చిత్తనూరు, గుడేగాన్తండా గ్రామాల పరిసర ప్రాంతంలో నిర్మించిన ఇథనాల్ కంపెనీకి నిర్మాణ అనుమతులు కేంద్రం ఇచ్చిందని తెలిపారు. కంపెనీ నుంచి రైతులకు నష్టం వాటిల్లితే రైతుల పక్షాన ముందుండి పో రాడుతానని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇథనాల్ కంపెనీకి బీఆర్ఎస్ అనుమతిచ్చిందని ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించినట్లు తెలిపారు. ప్రజలు మోసగాళ్ల మాటలు నమ్మి మో సపోయారని, మరోసారి ఇలాంటి అసత్యాలను నమ్మి మోసపోవద్దని కోరారు. గతంలో ఆరోపణలు చేసిన వారు అధికారంలో కి వచ్చి 5నెలలైనా ఎందుకు కంపెనీపై చర్యలు తీసుకోవడం లేద ని ప్రశ్నించారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి కులాలు, మ తాలతో రాజకీయం చేస్తూ కాంగ్రెస్, బీజేపీ తెలంగాణ అభివృద్ధిని మరిచాయన్నారు. బీఆర్ఎస్ను గెలిపించి అభివృద్ధికి పాటుపడాలని కోరారు.
మక్తల్ కౌన్సిలర్ రాములు ఆధ్వర్యంలో బుధవారం ఉద యం మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి స్వగృహంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. వీరికి చిట్టెం గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ఎండీ సలీం, పట్టణాధ్యక్షుడు చిన్న హ న్మంతు, బీఆర్ఎస్ నాయకులు శంకర్, రాఘవేందర్
మాగనూరు, మే 8 : మండలంలోని నేరేడుగంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన 39 మంది నాయకులు బుధవారం మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు. వీరికి చిట్టెం కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ పాలనలో అన్నివర్గాల సంక్షేమానికి పా టుపడినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎన్నికల ఇన్చార్జి సలీం, మాగనూరు మండలాధ్యక్షుడు ఎల్లారెడ్డి, మక్తల్ మండలాధ్యక్షుడు మహిపాల్రెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్ వెంకటరెడ్డి, మాజీ మారెట్ కమిటీ చైర్మన్ నరసింహగౌడ్, అనంత్రెడ్డి మాజీ సర్పంచ్ ఉసేనప్ప, ఈశ్వర్, జమీల్ పాల్గొన్నారు.