By Maduri Mattaiah
mythri movie makers | కరోనా మహమ్మారి విజృంభణతో ఈ ఏడాదిలో అన్ని రంగాలతో పాటు సినీ పరిశ్రమ కూడా భారీగానే నష్టాలను చవిచూసింది. థియేటర్లు మూతపడటంతో చాలా మంది నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీలో డైరెక్ట్గా విడుదల చేశారు. అయితే ఇంత కరోనా కష్టకాలంలో కూడా తమ సినిమాలను విడుదల చేసి లాభపడ్డ నిర్మాతలు ఉన్నారు.
కరోనా మొదటి వేవ్ తగ్గిన తర్వాత 2021 ఫిబ్రవరిలో మెగా మేనల్లుడు వైష్ణవ్తేజ్ ఉప్పెన థియేటర్లో విడుదలై ఘనవిజయం సాధించింది. దాదాపు 100 కోట్లు వసూలు చేసి ఈ చిత్రం మైత్రీ మూవీస్ అధినేతలకు భారీ లాభాలను సాధించిపెట్టింది. అయితే ఉప్పెన విడుదలైన మూడు వారాలకే మళ్లీ కరోనా సెకండ్వేవ్ ప్రారంభమైంది. ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ పుష్ప చిత్రంతో మరోసారి మైత్రీమూవీస్ సంస్థ భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. డిసెంబర్ 17న పాన్ ఇండియా సినిమాగా విడుదలైన ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీలో కూడా రికార్డు కలెక్షన్లను వసూలు చేస్తోంది. ముఖ్యంగా హిందీలో ఈ చిత్రం రూ.45 కోట్లకు పైగా వసూలు చేసి కేజీఎఫ్ను దాటేసింది.
తాజాగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటం, ఒమ్రికాన్ కేసులు అత్యధిక సంఖ్యలో నమోదవుతున్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. తాజాగా ఢిల్లీలో థియేటర్లు, ఫంక్షన్హాల్స్ మూసివేసినట్లుగా ప్రకటించారు. కొన్ని రాష్ట్రాలు అయితే 50 శాతం ఆక్యుపెన్సీకి మొగ్గుచూపుతున్నాయి. దీంతో ఈసారి కూడా కరోనా ప్రతికూల పరిస్థితి నుంచి మైత్రీ మూవీస్ నిర్మాతలు బయటపడ్డారని అంటున్నాయి ట్రేడ్వర్గాలు. పుష్స విడుదల ఒకవారం ఆలస్యమైనా పరిస్థితి మరోలా ఉండేదని,అంతేకాదు 2021లో ఉప్పెన, పుష్పల రూపంలో రెండు భారీ విజయాలు తమ ఖాతాలో వేసుకున్నారు మైత్రీ మూవీస్ నిర్మాతలు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
సీక్రెట్గా విడాకులు తీసుకున్న మ్యూజిక్ డైరెక్టర్.. ఏడాది తర్వాత రివీల్
Shyam singharoy | ఓటీటీలో శ్యామ్ సింగరాయ్ సినిమా.. వచ్చేది అప్పుడేనా?
Ram Charan Co star | ఈ హీరో డ్యాన్స్ ను రాంచరణ్ ఫుల్ ఎంజాయ్ చేస్తాడట
Jr ntr is lion | ఎన్టీఆర్ సింహం లాంటి వాడన్న రాంచరణ్
ట్రిపుల్ ఆర్ రిలీజ్ వాయిదా పడుతుందా? క్లారిటీ ఇచ్చిన తరణ్ ఆదర్శ్