సాధారణంగా బాక్సాపీస్ వద్ద (Box office fight) హీరోహీరోయిన్ల సినిమాల మధ్య పోటీ ఉంటుందని తెలిసిందే. అయితే కోవిడ్ ఎఫెక్ట్ (Covid 19)తో థియేటర్లకు ఆదరణ కరువవడంతో అలాంటి పోటీని చూడక చాలా కాలమే అవుతుంది. సెకండ్ లాక్డౌన్ తర్వాత ఇప్పుడిప్పుడే థియేటర్లు గాడిలో పడి పెద్ద సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే అఖండ థియేటర్లలో తన హవా కొనసాగిస్తోంది. త్వరలో పాన్ ఇండియా ప్రాజెక్టు పుష్ప కూడా డిసెంబర్ 17న థియేటర్లలో సందడి చేయనుంది. దీని తర్వాత బ్యాక్ టు బ్యాక్ బిగ్ ప్రాజెక్టులు బాక్సాపీస్ వద్ద నువ్వా..నేనా..? అన్నట్టుగా బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నాయి.
ఈ జాబితాలో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన చిత్రాలు మూడున్నాయి. వీటిలో ఒకటి కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న ఆచార్య (Chiranjeevi), పాండిరాజ్ డైరెక్షన్ లో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) నటిస్తోన్న సినిమా ( Etharkkum Thunindhavan), మరోవైపు శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వంలో తాప్సీ లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రం శభాష్ మిథు (Shabaash Mithu). సూర్య సినిమాలు తెలుగులో కూడా విడుదలవుతాయని తెలిసిందే. ఈ మూడు సినిమాలు బాక్సాపీస్ వద్ద ఒకే రోజు అనగా 2022 ఫిబ్రవరి 4న రాబోతున్నట్టు ట్రేడ్ సర్కిల్ టాక్.
ఆచార్య, సూర్య చిత్రాలు డేట్ ఫిక్స్ చేశాయి…తాప్సీ మూవీ డేట్ ఫైనల్ కావాల్సి ఉంది. ఒకవేళ డేట్ కన్ఫామ్ అయితే హిందీ, తెలుగు, తమిళ చిత్రాల మధ్య పోటీ ఉండటం ఖాయమని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే బాక్సాపీస్ వద్ద ఫైట్ ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.
ఇవి కూడా చదవండి..
Mangli Kollywood debut | రూటు మార్చిన సింగర్ మంగ్లీ..!
Mahesh family with star director | స్టార్ డైరెక్టర్ ఫ్యామిలీతో మహేశ్బాబు కపుల్
Rashmika Preperation | తిరుపతిలోని ఓ గ్రామానికి వెళ్లిన రష్మిక..ఎందుకో తెలుసా..?
AKhanda Like Mass Jathara |మాస్ జాతరలా ‘అఖండ’..ఇండస్ట్రీకి హిట్టు వచ్చినట్టే
Unstoppable Crazy update | నందమూరి అభిమానులకు గుడ్న్యూస్..నిజమెంత..?