కరోనా వలన జనజీవితం అస్తవ్యస్తం కాగా, పేదలు నిరాశ్రయులయ్యారు. వారిని ఆదుకునేందుకు సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. తమిళ నాట పెరుగుతున్న కోవిడ్ ప్రభావం నిమిత్తం అనేకమంది సినీ తారలు తమిళనాడు ప్రభుత్వ నిధికి భారీ మొత్తంలో విరాళాలు అందించారు. ఇప్పటికే సూర్య, కార్తీ సోదరులు కోటి విరాళం అందించగా, మురుగదాస్ రూ. 25 లక్షలు, అజిత్ 25 లక్షలు, సౌందర్య రజనీకాంత్ భర్త విశాగణ్ కోటి రూపాయలు , దర్శకుడు వెట్రిమారన్ ,రూ.10 లక్షలు, ఎడిటర్ మోహన్, ఆయన తనయుడు మోహన్ రాజా, జయం రవి రూ. 10 లక్షల రూపాయలు, తమిళ నటుడు శివ కార్తికేయన్ విరాళం కింద పాతిక లక్షలు, శంకర్ రూ. 10 లక్షల రూపాయలు అందించారు.
తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ని కలిసి రూ.50 లక్షల రూపాయలు విరాళం అందించారు. కాగా, రజనీకాంత్ 35 రోజుల పాటు హైదరాబాద్లో అన్నాత్తె షూటింగ్ చేయగా, రీసెంట్గా ప్రత్యేక ఫ్లైట్లో హైదరాబాద్ నుండి చెన్నైకు వెళ్లారు. ఈ రోజు వీలు చూసుకొని సీఎంను కలిసి విరాళం అందించారు.
Superstar @rajinikanth met Hon’ble Chief Minister of TN, @mkstalin and handed over a cheque of Rs 50 Lakhs#TNCMPublicRelieffund #CoronaRelieffund pic.twitter.com/bXjpoqj8v3
— BA Raju's Team (@baraju_SuperHit) May 17, 2021