టాలీవుడ్ (Tollywood) హీరోలు శర్వానంద్ (Sharwanand), సిద్దార్థ్ (Siddharth) కాంబోలో వస్తున్న చిత్రం మహాసముద్రం (Tollywood) . అనూ ఇమ్మాన్యుయేల్, అదితీ రావు హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ మూవీ ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది. అజయ్ భూపతి (Tollywood) దర్శకత్వ ప్రతిభపై ప్రశంసలు కురిపిస్తున్నారు సినీ ప్రేమికులు. ట్రైలర్ లాంఛ్ కార్యక్రమంలో శర్వానంద్ మాట్లాడుతూ..ఈ సినిమాతో సిద్ధార్థ్ లాంటి మంచి స్నేహితుడిని పొందినట్టు చెప్పాడు.
సిద్దార్థ్తో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందన్నాడు శర్వానంద్. దూకుడు చిత్రం పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మహాసముద్రం ట్రైలర్ ను విడుదల చేయడంతో నిర్మాత అనిల్ సుంకర చాలా ఆనందంగా ఫీలయ్యారు. కథ వినిపిస్తున్న సమయంలో ఒక్క ప్రశ్న కూడా వేసేందుకు అజయ్ భూపతి నాకు అవకాశమివ్వలేదు. ఆర్ఎక్స్ 100 సినిమా 4 పాత్రల చుట్టూ నడిస్తే..మహాసముద్రం 9 పాత్రల చుట్టూ తిరుగుతుంది. ఇలాంటి లోతైన కథనం ఉన్న సినిమా గురించి నేనిప్పటి వరకు వినలేదు. అన్ని భావోద్వేగాలతో నిండిన కుటుంబ కథాచిత్రం మహాసముద్రం అని శర్వానంద్ అన్నాడు.
అజయ్ భూపతి (Ajay Bhupathi) మాట్లాడుతూ..మహా అనేది సినిమాలో ఒక హీరోయిన్ పేరు. ఆమె పాత్రలో ఎవరు నటించారన్నది చెప్పలేను. ఈ సినిమాలో ప్రధానంగా 2 క్యారెక్టరైజేషన్లుంటాయి. వీటిలో ఒకరిది నిశ్శబ్దంగా సాగే పాత్ర కాగా..మరొకరిది సముద్ర అల లాంటి దూకుడు స్వభావమున్న పాత్ర అని చెప్పుకొచ్చాడు.
Raviteja Heroines | హీరోయిన్ల సాయం తీసుకుంటున్న రవితేజ
Shalini Pandey | అనుకోకుండా బాలీవుడ్ అవకాశం : షాలినీ పాండే
Tamannaah Bhatia| తన ఆరోగ్య సమస్యను దాచి పెట్టిన తమన్నా..!