ప్రతీ ఏడాది జరిగే సినీ అవార్డుల ప్రదానోత్సవాల్లో పాపులర్ ఫిలింఫేర్ అవార్డ్స్ అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. 67వ ఫిలింఫేర్ అవార్డ్స్ (Filmfare Awards 2022) కార్యక్రమం మంగళవారం రాత్రి ముంబైలో జరిగింది. ఈ అవార్డుల్లో సర్దార్ ఉధమ్ (Sardar Udham) సినిమాకు క్రిటిక్స్ ఛాయిస్లో విక్కీ కౌశల్ (Vicky Kaushal ) ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు.
అంతేకాకుండా సర్దార్ ఉధమ్..ఉత్తమ చిత్రం, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ కాస్ట్యూమ్, ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్, ఉత్తమ స్క్రీన్ప్లే, ఉత్తమ సౌండ్ డిజైన్ కేటగిరీల్లో అవార్డులు దక్కించుకుంది. మిమీ (Mimi) చిత్రానికి కృతిసనన్ (Kriti Sanon) ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. దీంతోపాటు మిమీ చిత్రానికి ఉత్తమ సహాయనటుడిగా పంకజ్ త్రిపాఠి, ఉత్తమ సహాయ నటిగా సాయి తంహంకర్ మరో రెండు అవార్డులు అందుకున్నారు.
సిద్దార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ నటించిన షేర్షా ఉత్తమ చిత్రం అవార్డు అందుకుంది. మరో ఐదు కేటగిరీల్లో షేర్షా అవార్డులు అందుకుంది. రన్ వీర్ సింగ్ (Ranveer Singh) 83 సినిమాకు ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నాడు. వీటితోపాటు అట్రాంగి రే, షేర్ని, సందీప్ ఔర్ పింకీ పరార్, చండీగఢ్ కరే ఆశీఖీ సినిమాలు వివిధ కేటగిరీల్లో అవార్డులు అందుకున్నాయి.