ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్ల జాబితాలో ముందు వరుసలో ఉంటుంది చెన్నై ముద్దుగుమ్మ సమంత (Samantha). ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ భామ కొంతకాలంగా కనిపించడం లేదు. సామ్ నెట్టింటి నుంచి బ్రేక్ తీసుకుంది. సామ్ సోషల్ మీడియా(Social media)లో కనిపించక దాదాపు నెల అవుతుంది. ఇంతకీ కారణమేంటనుకుంటున్నారా..? తన వర్క్పై ఫోకస్ పెట్టేందుకే బ్రేక్ తీసుకుందని ఇన్ సైడ్ టాక్.
ప్రస్తుతమున్న అప్డేట్ ప్రకారం రస్సో బ్రదర్స్ తెరకెక్కించిన ‘Citadel’ ఇండియన్ వెర్షన్ కోసం ప్రిపరేషన్లో బిజీగా ఉందట సామ్. రాజ్-డీకే ( Raj-DK) దర్శకద్వయం డైరెక్ట్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో పలు యాక్షన్ సన్నివేశాలుండటంతో.. అందుకోసం ప్రిపరేషన్ లో భాగంగా మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ కూడా తీసుకుంది సమంత .
ఇదిలా ఉంటే సామ్ మళ్లీ సోషల్ మీడియాలో రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతుందట. తన అప్కమింగ్ సినిమాలు, ఇతర అప్డేట్స్ ఇచ్చేందుకు త్వరలోనే నెట్టింట ప్రత్యక్షం కాబోతుందని కొత్త న్యూస్ ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచింది. సమంత ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో నటించిన శాకుంతలం విడుదల కావాల్సి ఉంది. మరోవైపు ఫీ మేల్ సెంట్రిక్ సబ్జెక్టు యశోదలో కూడా నటిస్తోంది.