భారీ అంచనాల మధ్య విడుదలైన ఆర్ఆర్ఆర్ (RRR) మెల్లమెల్లగా రికార్డుల వేట షురూ చేసినట్టు తాజాగా వస్తున్న అప్ డేట్స్ చెబుతున్నాయి. ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్టు నైజాం ఏరియాలో రాబట్టిన వసూళ్లు (Nizam Record) ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచాయి. నైజాంలో బాక్సాపీస్ వద్ద ఇప్పటివరకు మంచి కలెక్షన్లను రాబట్టినట్టు టాలీవుడ్ సర్కిల్ టాక్.
ట్రేడ్ ఎనలిస్టుల ప్రకారం ఆదివారం ఒక్క రోజు ఆర్ఆర్ఆర్ రూ.15 కోట్లు షేర్ వసూళ్లు చేసింది. వీటితో కలిపి ఇప్పటివరకు నైజాంలో రూ.53 కోట్ల షేర్ మార్క్ను క్రాస్ చేసినట్టు సమాచారం. నైజాంలో ప్రీ రిలీజ్ బిజినెస్ (pre-release business) 75 కోట్లతో జరిగినట్టు తెలుస్తుండగా..ప్రింట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి 85 కోట్ల వరకు బిజినెస్ జరిగిందని ఇన్ సైడ్ టాక్. వీక్ డేస్ ఇవాళ్టి నుంచి షురూ అయ్యాయి. మరి నేటినుంచి ఆర్ఆర్ఆర్ ఎంత వసూళ్లను రాబడుతుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది.
డీవీవీ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్పై డీవీవీ దానయ్య భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పీరియాడిక్ డ్రామా బ్యాక్ డ్రాప్ తెరకెక్కిన ఈ చిత్రంలో రాంచరణ్, ఎన్టీఆర్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ఆర్ఆర్ఆర్లో రాంచరణ్ (Ram Charan), జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తమ తమ పాత్రలకు ప్రాణం పోశారని సినీ లవర్స్ అంటున్నారు. బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్ సీతగా ఆకట్టుకుంది.