ఫిదా సినిమా తర్వాత టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల (Sekhar Kammula) మరోసారి ప్రేమకథ నేపథ్యంలో లవ్ స్టోరీ (Love Story) తెరకెక్కిస్తున్నాడు. నాగచైతన్య (Naga Chaitanya), సాయిపల్లవి ( Sai Pallavi) కాంబోలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 24న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా ప్రేక్షకులతో పలు విషయాలు పంచుకున్నాడు శేఖర్ కమ్ముల. నేను ఇదివరకు తీసిన రొమాంటిక్ డ్రామాల్లో కుటుంబం లేదా భార్యభర్తల మధ్య నెలకొనే చిన్న చిన్న సంఘర్షణలు కనిపించేవి. అయితే లవ్ స్టోరీ చాలా పెద్దదన్నారు.
కుల వ్యవస్థ, లింగ అసమానత లాంటి పెద్ద సమస్యలను సినిమాలో ప్రస్తావించడం జరిగింది. ఈ సమస్యలు దశాబ్దాలుగా ఉన్నాయి. వాటికి ఎలాంటి పరిష్కరం చూపించారన్న ప్రశ్నకు స్పందిస్తూ..కుల వ్యవస్థ, లింగ అసమానత చాలా సంవత్సరాలుగా ఉన్నాయని అంగీకరించాలి. ఆధునిక కాలంలో, వయస్సులో ఈ సమస్యలకు సరైన పరిష్కారం ఎలానో చూపించాం. ఆ సమస్యలను నేను ఎప్పటికీ తొలగించలేను. కానీ నాకు సాధ్యమైనంత వరకు పరిష్కారం ఇవ్వడానికి ప్రయత్నించానని చెప్పుకొచ్చాడు.
సినిమా చాలా సార్లు వాయిదా పడుతూ రావడంపై మాట్లాడుతూ..విడుదల చాలా సార్లు వాయిదా పడటం కేవలం నిర్మాత వల్లే..దీంతో తీవ్ర నిరాశపడ్డాం. థియేటర్లలోనే విడుదల చేయాలని నిర్మాతలు కోరుకున్నారు. కోవిడ్ వల్ల రెట్టింపు స్థాయిలో డబ్బులు పెట్టారు. చాలా కష్టపడ్డాం. ట్రైలర్ ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. అందరి అంచనాలు అందుకుంటుంది. ఈ సినిమాకు ఖచ్చితంగా రిపీట్ ఆడియెన్స ఉంటారని ధీమా వ్యక్తం చేశాడు శేఖర్ కమ్ముల.
Viral Video | కొండకోనల్లో దారి తప్పిన నటుడు.. గుర్తుపట్టి సెల్ఫీలు దిగిన పోలీసులు
Aamir Khan | చిరంజీవి కోసం అమీర్ ఖాన్ స్పెషల్ షో వైరల్
Jagapathi Babu: యూఎస్లో సరదాగా.. జగపతి బాబు పోస్ట్ వైరల్