ఇపుడు టాలీవుడ్ (Tollywood) ప్రేక్షకుల దృష్టి అంతా శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో వస్తున్న లవ్ స్టోరీ (Love Story) పైనే ఉంది. ఇటీవలే విడుదలైన ట్రైలర్ హీరో హీరోయిన్ల మధ్య సాగే తెలంగాణ యాసలో సాగే సంభాషణలు, లవ్ ట్రాక్ తో ఆకట్టుకుంటోంది. ట్రైలర్ తో సినిమాపై సినీ ప్రేక్షకుల్లో అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. సాయిపల్లవి (Sai Pallavi), నాగచైతన్య (Naga Chaitanya) కాంబోలో వస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 24న థియేటర్లలో సందడి చేయనుంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి బయటకు వచ్చింది.
సెప్టెంబర్ 19న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు మేకర్స్. ఆదివారం సాయంత్రం సినీ లవర్స్ కు నిర్మాతలు పెద్ద సర్ ప్రైజ్ చేయబోతున్నారట. తాజా సమాచారం ప్రకారం టాలీవుడ్ అగ్రహీరోలిద్దరు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాబోతున్నారు. చిరంజీవి (Chiranjeevi ), నాగార్జున (Nagarjuna) ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రానున్నారని మేకర్స్ ప్రకటించారు. ఆదివారం సాయంత్రం మూవీ లవర్స్ కు ఒక పండగే అని చెప్పొచ్చు.
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్లపై కే నారయణ్ దాస్ నారంగ్, పీ రామ్మోహన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ సీ హెచ్ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పటికే విడుదలైన పాటలకు అద్బుతమైన స్పందన వస్తోంది. లవ్ స్టోరీ మ్యూజికల్ హిట్ గా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
Priya Prakash Varrier | ప్రియా వారియర్ పాటకు ఫిదా అవ్వాల్సిందే..వీడియో వైరల్
Jagapathi Babu: యూఎస్లో సరదాగా.. జగపతి బాబు పోస్ట్ వైరల్
Love Story: హృద్యంగా ఉన్న లవ్ స్టోరీ ట్రైలర్..!