Kodandaram | ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంకు నిరసన సెగ తగిలింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి పెంచే అంశంపై కోదండరాంను అడ్డుకున్న నిరుద్యోగులు అడ్డుకున్నారు. మీరు చెప్తేనే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశాము, ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు? అని నిలదీశారు. మీ మాటలు నమ్మి మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించాము. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని పట్టించుకోకపోతే ఎందుకు మౌనంగా ఉన్నారు? మీడియా కూడా మా సమస్యలను కవర్ చేయడం లేదన్నారు. మీరు 60 ఏళ్లకు సుప్రీంకోర్టుకు వెళ్లి ఎమ్మెల్సీ కావొచ్చు కానీ, మేము 30 ఏళ్లకు ఉద్యోగం చేయడానికి పనికిరామా? అని సూటిగా ప్రశ్నించారు. మా సమస్యలను కవర్ చేయమని మీడియాకు చెప్పండి అంటూ కోదండరాంను నిలదీశారు. దీంతో నిరుద్యోగులకు సమాధానం చెప్పలేక కోదండరాం వెనుదిరిగారు.
మీరు 60 ఏళ్లకు సుప్రీంకోర్టుకు వెళ్లి ఎమ్మెల్సీ కావొచ్చు కానీ, మేము 30 ఏళ్లకు ఉద్యోగం చేయడానికి పనికిరామా?
ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంకు నిరసన సెగ
మీరు చెప్తేనే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశాము, ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు?
కోదండరాంను అడ్డుకుని నిలదీసిన నిరుద్యోగులు, సమాధానం… pic.twitter.com/He5j4g1Laa
— Telugu Scribe (@TeluguScribe) August 12, 2026