రాజు శ్రీ వాస్తవ (Raju Srivastava) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇటీవలే తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన మృతితో సినీ పరిశ్రమ, మూవీ లవర్స్ తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. తొలిసారి రాజు శ్రీ వాస్తవ కూతురు అంటారా (Antara) ఆస్పత్రిలో ఉన్నపుడు ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడింది. నెల రోజులకుపైగా ఆస్పత్రిలో ఉన్నపుడు తండ్రి పరిస్థితి ఎలా ఉన్నాడో చెప్పుకొచ్చింది. అది తన కుటుంబానికి చాలా కష్టసమయమని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది .
‘నేను ఈ రాత్రికి అమ్మతో కలిసి ముంబైకి వెళ్తున్నా. ఆమె బాగాలేదు. ఇది మాకు చాలా కష్టతరమైన సమయం..నాన్న ఆస్పత్రిలో ఉన్నపుడు ఏమీ మాట్లాడలేదు. ఇవాళ ముంబైలోని ISCKON Juhuలో సంతాప సమావేశం ఉంది. దీని తర్వాత కాన్ఫూర్లో మరో పూజా కార్యక్రమం ఉంది. మేం త్వరలోనే ఢిల్లీకి తిరిగెళ్తాం. చాలా కార్యక్రమాలు చేయాల్సి ఉంది. కాన్పూర్ నాన్నకు ఇల్లు. అక్కడ కూడా మేం పూజ చేస్తామని’ జాతీయ మీడియాతో చెప్పుకొచ్చింది.
రాజు శ్రీవాస్తవ ఆగస్టులో ట్రెడ్మిల్పై వర్కవుట్ చేస్తున్న సమయంలో ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో కుప్పకూలారు. దీంతో ఢిల్లీలోని ఎయిమ్స్కు తరలించారు. కార్డియాలజీ, ఎమర్జెన్సీ విభాగాలకు చెందిన ఎయిమ్స్ వైద్యుల బృందం చికిత్సనందించింది. అయితే పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు.