వరంగల్ : వరంగల్ ట్రై సిటీ పరిధిలో లాక్ డౌన్ మరింత పటిష్టంగా అమలు చేసేందుకుగాను పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతి గల్లీలోను పోలీసులు తనిఖీలు నిర్వహించాల్సిందిగా వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి అధికారులను అదేశించారు. సీపీ ఆలోచన మేరకు నగరంలోని పోలీస్ స్టేషన్ల వారీగా ఎంపిక చేసిన కానిస్టేబుళ్లతో ప్రత్యేక బైక్ పెట్రోలింగ్ బృందాన్ని ఏర్పాటు చేశారు. స్టేషన్ ఘన్పూర్ ఏఎస్పీ వైభవ్ గైఖ్వాడ్ అధ్వర్యంలో ఈ బృందం విధులు నిర్వహిస్తున్నారు.
ముఖ్యంగా కాలనీలు, వీధుల్లోను రోడ్లపైకి ఎలాంటి కారణం లేకుండా వచ్చే వాహనదారులతో ప్రజలను నియంత్రించేందుకుగా ఈ బైక్ పెట్రోలింగ్ బృందాలు నగరంలోని వివిధ వీధులు, కాలనీలలో ఆకస్మికంగా పెట్రోలింగ్ నిర్వహిస్తారు. ఈ పెట్రోలింగ్ నిర్వహించే సమయం పోలీసులు వీధుల్లో కాని కాలనీల్లో తనీఖీ చేపడుతారు.
ఈ తనిఖీల్లో ఎలాంటి కారణం లేకుండా రోడ్ల మీదకు వచ్చిన వాహనాలపై జరిమానాలతో పాటు వాహనాలను సైతం సీజ్ చేసి సంబంధిత పోలీస్ స్టేషన్లకు తరలిస్తారు. ముఖ్యంగా ఈ పెట్రోలింగ్ బృందాలు ప్రజలకు లాక్ డౌన్ పట్ల మరింత అవగాహన కల్పించడంతో పాటు అనవసరం రోడ్ల మీదకు రావడం వలన కలిగే నష్టాలపై పబ్లిక్ అడ్రసింగ్ సిస్టం ద్వారా ప్రజలకు వివరిస్తారు.
ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ.. కరోనాను నియంత్రించడం కోసం ప్రతి ఒక్కరూ ప్రభుత్వం ప్రకటించిన లాకౌన్ నిబంధనలను పాటిస్తూ, ఇండ్లకు పరిమితంగా కావాలన్నారు. లాక్ డౌన్ నియామాలను అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన తీసుకుంటామన్నారు.
అదే విధంగా కారణం లేకుండా రోడ్ల మీదకు వచ్చే వాహనాలను సీజ్ చేస్తామన్నారు. కార్యక్రమములో హన్మకొండ ఇన్ స్పెక్టర్ చంద్రశేకర్ గౌడ్, హన్మకొండ ప్రోబిషనరీ ఎస్ఐ శివ కృష్ణతో పాటు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
మండపంలో పెండ్లి కూతురు.. పోలీసు వాహనంలో తల్లిదండ్రులు
పోలీసులమని బెదిరించి.. బంగారం దోచుకెళ్లిన దుండగులు
దారుణం : హత్యకు దారి తీసిన భూ తగాదా
బాధ్యతగా పని చేయండి : మంత్రి హరీశ్ రావు
ఇలాగైతే ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ను రద్దు చేస్తాం
నెక్కొండ పీహెచ్సీని సందర్శించిన ఎమ్మెల్యే పెద్ది
యాదాద్రిలో ప్రారంభమైన నృసింహుడి జయం