ఓ వైపు సినిమాలతో అభిమానులను ఎంటర్ టైన్ చేస్తూనే..మరోవైపు పొలిటికల్ ప్లాన్తో కూడా బిజీగా మారిపోయారు టాలీవుడ్ యాక్టర్, జనసేన చీఫ్ పవన్కల్యాణ్ (Pawan Kalyan). 2024లో ఏపీలో అధికారంలోకి రావడమే ధ్యేయంగా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. సినిమా షూటింగ్ షెడ్యూల్కు మధ్యలో పొలిటికల్ యాక్టివిటీస్కు టైం కేటాయిస్తున్నారు. మంగళగిరి జనసేన (Mangalagiri janasena meeting) కార్యాలయంలో అక్కడి కార్యకర్తలతో ముఖ్యమైన సమావేశం ఏర్పాటు చేశారు. పలు అంశాలపై చర్చించారు.
ఇక సమావేశం సందర్భంగా తన అభిమానుల (Pawan fans) కోరిక మేరకు స్టేజీపై కూర్చొని ఫొటో దిగారు. ఈ ఫొటో ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్లో హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu)సినిమాతో బిజీగా ఉన్నారు. పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచరస్ సినిమాగా వస్తున్న ఈ చిత్రాన్ని మేఘ సూర్య ప్రొడక్షన్ బ్యానర్పై ఎ దయాకర్రావు నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మరోవైపు సముద్రఖని డైరెక్షన్లో వినోధయ సీతమ్ తెలుగు రీమేక్లో నటిస్తున్నారు.
సాయిధరమ్ తేజ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది ఈ ప్రాజెక్టు. మరోవైపు హరీష్ శంకర్తో భవదీయుడు భగత్ సింగ్ సినిమా కూడా చేయాల్సి ఉండగా..పలు కారణాలతో సినిమా ఆగిపోయినట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్.
Read Also : Pavitra lokesh | నరేశ్ మంచి వ్యక్తి..మీడియాతో పవిత్రా లోకేశ్..తెరపైకి మూడో భార్య..!