టాలీవుడ్లో కొంతకాలంగా హాట్ టాపిక్గా మారిన అంశం నరేశ్ (Naresh) పెళ్లి. తెలుగు, కన్నడ ప్రేక్షకులకు సుపరిచితమైన నటి పవిత్రా లోకేశ్ (Pavitra lokesh)ను నరేశ్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే పవిత్రా లోకేశ్తో కలిసి సినిమాల్లో నటించానని, తాను మానసికంగా కుంగిపోయినపుడు పవిత్రా లోకేశ్ అండగా నిలిచిందని నరేశ్ ఇటీవలే చెప్పుకొచ్చారు. తనకున్న చాలా మంది స్నేహితులు, ఆత్మీయులల్లో ఆమె కూడా ఒకరని.. పవిత్రా లోకేశ్ తనకు ఫిలాసఫర్ గైడ్ అని అన్నారు నరేశ్.
అయితే ఇప్పటివరకు ఎన్ని వార్తలు వస్తున్నా అఫీషియల్గా మాట్లాడని పవిత్రా లోకేశ్ తాజాగా మీడియా ముందుకొచ్చి టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచారు. బెంగళూరులో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నరేశ్ చాలా మంచి వ్యక్తి అని..ఆయనకు, తనకు మధ్య దాపరికాలేమి లేవన్నారు. (Ramya raghupathi) రమ్య రఘుపతి (నరేశ్ మూడోభార్య)కి నరేశ్తో ఏమైనా సమస్య ఉంటే ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నారని.. హైదరాబాద్లో చూసుకోవాలని సూచించారు. రమ్య కేవలం పేరు, పాపులారిటీ కోసమే మీడియా ముందుకొస్తున్నారని ఆరోపించారు.
సుచేంద్ర నా భర్త కాదు..
అంతేకాదు సుచేంద్ర తన మొదటి భర్త అంటూ వస్తున్న వార్తలపై కూడా క్లారిటీ ఇచ్చారు పవిత్రా లోకేశ్. సుచేంద్ర నా భర్త కాదు. నేను ఆయనతో రిలేషన్ షిప్లో మాత్రమే ఉన్నా. ఇక ఆరేళ్లుగా సుచేంద్రకు దూరంగా ఉంటున్నానన్నారు. కొంతమంది సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్స్ తో తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ పవిత్రాలోకేశ్ ఇప్పటికే కర్ణాటక సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా..దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు.
ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు: రమ్యరఘుపతి
ఈ నేపథ్యంలో నరేశ్ మూడో భార్య రమ్యరఘుపతి బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ..తాను నరేశ్ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని అన్నారు. మూడేళ్ల నుంచి తమ మధ్య విబేధాలున్నాయని చెప్పారు. పవిత్రాలోకేశ్ నా భార్య అని నరేశ్ ప్రెస్ మీట్లో చెప్పారు. పవిత్రతో పెళ్లవడం వల్లే నరేశ్ అలా చెప్పారని అన్నారు రమ్య. తెరపైకి ఒకేసారి పవిత్రా లోకేశ్, రమ్యరఘుపతి రావడంతో ఇంతకీ నరేశ్-పవిత్రాలోకేశ్కు పెళ్లయిపోయిందా..? కాకపోయి ఉంటే..వీరిద్దరి పెళ్లి జరిగేనా..? అంటూ ఇపుడు తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు.