గతేడాది గోపీచంద్ మలినేని డైరెక్షన్లో వచ్చిన క్రాక్ చిత్రంలో జయమ్మ (Jayamma) పాత్రలో మెరిసింది కోలీవుడ్ నటి వరలక్ష్మీ శరత్కుమార్ (Varalakshmi Sarath Kumar). జయమ్మ పాత్ర ఈ యాక్టర్కు మంచి గుర్తింపు తీసుకురావడమే కాదు..ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెంచేసింది. ఈ బ్యూటీ మరో క్రేజీ ప్రాజెక్టులో కనిపించబోతుందన్న వార్త ఇపుడు ఫిలింనగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది.
గోపీచంద్ (Gopichand ), రాశీ ఖన్నా కాంబోలో వస్తున్న చిత్రం పక్కాకమర్షియల్ (Pakka commercial). మారుతి (maruthi) డైరెక్షన్లో కామెడీ ఎంటర్టైనర్ ఈ సినిమాట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ఈ మూవీలో వరలక్ష్మీ కీ రోల్ చేస్తుందని ఓ వార్త టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. ప్రస్తుతానికి మేకర్స్ ఈ విషయాన్ని సీక్రెట్గా ఉంచారని టాక్ నడుస్తోంది. వరలక్ష్మి కీ రోల్లో కనిపించబోయేది నిజమే అయితే..కచ్చితంగా ఆమె పాత్ర పవర్ ఫుల్గా ఉండటం ఖాయమని అనుకుంటున్నారు సినీ జనాలు.
మరి ఈ క్రేజీ న్యూస్పై సినిమా విడుదలయ్యే లోపు మేకర్స్ ఏదైనా క్లారిటీ ఇస్తారా..? లేదంటే సస్పెన్స్ లో ఉంచుతారా..? అనేది చూడాలి. పక్కా కమర్షియల్ చిత్రం జులై 1న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. ఈ చిత్రానికి జాక్స్ బీజోయ్ సంగీతం అందిస్తుండగా.. జీఏ2 పిక్చర్స్-యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై బన్నీవాసు (Bunny Vasu) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. SKN కో ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు.