Tamannaah About South Fans | మిల్క్ బ్యూటీ తమన్నాకు టాలీవుడ్లో ఉండే క్రేజ్ వేరు. తెలుగు ప్రేక్షకులను తన అందం, అభినయంతో కట్టి పడేసింది. ‘హ్యపీడేస్’ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ సోగసరి అనతి కాలంలోనే బిజీ నటిగా మారిపోయింది. దక్షిణాది దాదాపు స్టార్ హీరోలందరితో కలిసి నటించింది. యువ హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా క్రేజ్ ఏర్పరుచుకుంది. ప్రస్తుతం ఏడాదికి అరడజను సినిమాలలో నటిస్తూ తీరిక లేకుండా గడుపుతుంది. తాజాగా పింక్ విల్లా జరిపిన ఇంటర్వూలో తమన్నా సౌత్ ప్రేక్షకుల గురించి పలు వాఖ్యలు చేసింది.
‘నార్త్, సౌత్ అభిమానులను పోల్చి చూస్తే చాలా తేడా కనిపిస్తుందని తమన్నా తెలిపింది. దక్షిణాది ప్రేక్షకులు తమ అభిమాన ఆర్టిస్టులతో ఎంతో కనెక్ట్ అయ్యుంటారని, వాళ్ళకు ఎమోషన్స్ ఎక్కువ అని చెప్పింది. అంతేకాకుండా తనకు బాలీవుడ్లో ఆఫర్లు వచ్చినప్పటికీ ఇలాంటి అభిమానం అక్కడ చూడలేదని, సౌత్ ఫ్యాన్స్తో ఉన్న అనుబంధం విడదీయలేనిదని’ తమన్నా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తమన్నా చేతిలో ఐదు సినిమాలున్నాయి. అందులో సత్యదేవ్ ‘గుర్తుందా శీతాకాలం’ విడుదలకు సిద్దంగా ఉంది. దీనితో పాటుగా చిరంజీవి ‘భోళాశంకర్’ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. హిందీలో 3 చిత్రాలలో నటించింది. ఈ మూడు సినిమాలు షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.