కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తీవ్రంగా ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని నటుడు, జనసేన అధినేత పవన్కల్యాణ్ సూచించారు. తన ఆరోగ్యం కుదుట పడుతుందని, తాను ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించిన అభిమానులకు పవన్కల్యాణ్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు జనసేన పార్టీ పవన్ పేరుతో ఓ సందేశాన్ని షేర్ చేసింది.
నా ఆరోగ్యం మెరుగవుతుంది. డాక్టర్ల సలహాలు, సూచనలు పాటిస్తూ..వీలైనంత త్వరగా కోలుకుని మీ ముందుకొస్తాను. నేను కరోనా బారిన పడ్డానని తెలిసినప్పటి నుంచి సినీ, రాజకీయ, సామాజిక ప్రముఖులు నేను బాగుండాలని ఆకాంక్షించారు. నేను ఆరోగ్యంగా ఉండాలని సందేశాలు పంపించిన అందరికీ కృతజ్ఞతలు. జనసేన పార్టీ నాయకులు, నేతలు, అభిమానులు నా కోసం ఆలయాలు, ప్రార్థనా మందిరాల్లో పూజలు చేశారు. మీ గుండెల్లో నాకు స్థానం ఇచ్చిన మీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు పేరుతో నా బావోద్వేగాన్ని వ్యక్తపరచలేను. మీరంతా నా కుటుంబసభ్యులే. మీ కోసం ఆరోగ్యంగా తిరిగొచ్చి మీకు మద్దతుగా నిలుస్తాను. అని సందేశంలో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
గిరిజన యువతులుగా టాలీవుడ్ భామలు..!
నేను తెలుగు ప్రేక్షకులను విడిచివెళ్లను..
ఆసక్తికర టైటిల్తో విశ్వక్ సేన్ నయా చిత్రం
రికార్డు టైంలో సినిమా కంప్లీట్ చేయనున్న రవితేజ
ఉగాది వరకు ‘వకీల్ సాబ్’ 5 డేస్ కలెక్షన్స్
చెన్నై బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న ధనుష్..!
అమితాబ్ తో సినిమా చేస్తున్నానంటే నమ్మలేదు: రష్మ…