టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం పొలిటికల్ కమిట్మెంట్స్తో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే మళ్లీ ఎప్పుడు సినిమా షూటింగ్లో జాయిన్ అవుతాడనేది కొంతకాలంగా క్లారిటీ లేకుండా పోయింది. తాజాగా దీనికి సంబంధించిన అప్డేట్ ఇపుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. పవన్ కల్యాణ్ నటిస్తోన్నచిత్రాల్లో హరిహరవీరమల్లు (Hari Hara Veera Mallu), వినోధయ సీతమ్ రీమేక్ (Vinodhaya Sitham remake) ఉన్నాయి.
ఈ రెండు సినిమాలను పూర్తి చేయాలని ఫిక్సయ్యాడట పవన్. తాజాగా వస్తున్న కథనాల ప్రకారం పవన్ కల్యాణ్ అక్టోబర్ మొదటి వారం నుంచి సెట్స్లో జాయిన్ కాబోతున్నాడట. మొదటగా చాలా రోజులుగా పెండింగ్లో పడిపోయిన హరిహరవీరమల్లు చిత్రీకరణ షురూ చేయనున్నాడని ఇన్సైడ్ టాక్. వీలైనంత త్వరగా సినిమా పూర్తి చేయడం కోసం షెడ్యూల్స్ కూడా సిద్దం చేసుకున్నాడట.
క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ స్టోరీని మొదట పూర్తి చేసిన తర్వాత వినోధయ సీతమ్ రీమేక్ షూట్లో కూడా చేరబోతున్నాడని తెలుస్తోంది. హరిహరవీరమల్లు చిత్రంలో నిధి అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. అర్జున్ రాంపాల్, ఆదిత్యమీనన్, నర్గీస్ ఫఖ్రి కీ రోల్స్ చేస్తున్నారు. పూజిత పొన్నాడ ఐటెంసాంగ్లో మెరుబోతున్నట్టు టాక్.