టాలీవుడ్ (Tollywood) టాలెంటెడ్ డైరెక్టర్లలో ఒకరు పూరీ జగన్నాథ్ (Puri Jagannadh). తనదైన మార్క్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన పూరీకి ఇటీవల లైగర్తో భారీ డిజాస్టర్ ఎదురైంది. లైగర్ బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టడంతో నెట్టింట ట్రోల్స్ వర్షంలా కురిశాయి. ఈ మధ్య కాలంలో పూరీ నుంచి కొత్త సినిమా ప్రకటన ఉంటుందనుకుంటుండగా..ఇప్పటిదాకా అలాంటి అప్ డేట్ ఏమీ బయటకు రాలేదు.
కాగా పూరీకి సంబంధించిన వార్త ఇపుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ స్టార్ డైరెక్టర్ నెక్ట్స్ సినిమా కోసం కథ రాసే పనిలో బిజీగా ఉన్నాడట. పూరీ ప్రస్తుతం స్కిప్ట్ వర్క్లో భాగంగా టూరిజం స్పాట్ గోవాకు వెళ్లాడని టాక్. పూరీ తన కుమారుడు ఆకాశ్ (Akash Puri) తో తదుపరి సినిమాను చేయబోతున్నాడని వార్తలు రాగా..దీనిపై కూడా ఎలాంటి ప్రకటన లేదు.
ప్రస్తుతానికైతే కొత్త మూవీ కథ రాసుకుంటున్నట్టు తెలుస్తున్నప్పటికీ..ఇంతకీ పూరీ ఏ హీరో కోసం కథ రాస్తున్నాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్గా మారింది. విజయ్ దేవరకొండతో పూరీ జగన్నాథ్ రెండో ప్రాజెక్టు (జేజీఎం) జనగణమన చేయాల్సి ఉండగా..లైగర్ ఫెయిల్యూర్తో షూటింగ్ ప్రస్తుతానికి నిలిచిపోయింది.
మరోవైపు శివ నిర్వాణతో చేస్తున్న ఖుషీ సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డాడు విజయ్ దేవరకొండ. మరి నెక్ట్స్ ఏ హీరోతో సినిమా చేస్తున్నాడనేది చూడాలి.