padutha theeyaga | పాడుతా తీయగా.. తెలుగు ప్రేక్షకులకు ఈ రియాలిటీ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకటి రెండు కాదు ఏకంగా 25 సంవత్సరాలుగా బుల్లితెర ప్రేక్షకులతో ఈ కార్యక్రమం అనుబంధం పెనవేసుకుంది. వేలాది మంది నూతన గాయనీ గాయకులు ఈ కార్యక్రమం నుంచి తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ రోజు ఉన్నత స్థాయిలో ఉన్న ఎంతో మంది స్టార్ సింగర్స్కు ఈ కార్యక్రమంలోనే పునాదులు పడ్డాయి. ఇక లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆధ్వర్యంలో ఈ స్వర యజ్ఞం పాతికేళ్లుగా నిర్విఘ్నంగా కొనసాగింది. ఊహించని విధంగా గత ఏడాది బాలు మరణించడంతో.. పాడుతా తీయగా కార్యక్రమంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఎస్పీ బాలసుబ్రమణ్యం లేని పాడుతా తీయగా ప్రేక్షకులు చూడటం కష్టమే అని అందరూ భావించారు. అందుకే ఈ కార్యక్రమంలో ఆపేస్తారు అనే ప్రచారం కూడా జరిగింది.
ఈ సంగీత స్వరయజ్ఞం ఎప్పటికీ ఆగకూడదని కార్యక్రమ నిర్వాహకులు ఆసక్తికరమైన నిర్ణయం తీసుకున్నారు. పాడుతా తీయగా బాధ్యత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుమారుడు ఎస్పీ చరణ్ చేతుల్లో పెట్టారు. పాతికేళ్లుగా తన అమూల్యమైన సలహాలతో.. తన అనుభవంతో ఎంతోమంది గాయనీ గాయకులకు స్వర జీవితాన్ని ఇచ్చాడు బాలు. ఆయన వారసుడిగా ఈ కార్యక్రమం బాధ్యతలు తీసుకోబోతున్నాడు ఎస్పీ చరణ్. ఇప్పటికే సరికొత్త పాడుతా తీయగా కోసం ఎంపిక కూడా జరుగుతుంది. కరోనా కారణంగా ఆన్లైన్లోనే గాయకుల ఎంపిక జరిగింది. ఏకంగా 4 వేల మందిని ఆడిషన్ చేసి అందులో 16 మందిని ఎంపిక చేశారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ చరణ్ హోస్ట్ కాగా.. సింగర్ సునీత, సీనియర్ లిరిక్ రైటర్ చంద్రబోస్, ప్రముఖ గాయకుడు విజయ్ ప్రకాశ్ జడ్జిలుగా వ్యవహరించనున్నారు. మొత్తానికి బాలు లేని పాడుతా తీయగా ఎలా ఉండబోతుందో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
గాన గంధర్వుడికి పద్మవిభూషణ్.. రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం అందుకున్న ఎస్పీ చరణ్
SPB: మావయ్యా.. ఆ నమ్మకంతోనే నేను కూడా.. బతికేస్తున్నా: సింగర్ సునీత
ఇండియాలోనే తొలి సైన్స్ ఫిక్షన్ ఆదిత్య369 : కథ చెప్పగానే బాలకృష్ణ రియాక్షన్ ఏంటి?
Akhanda trailer | బ్రేకుల్లేని బుల్డోజర్ని.. తొక్కిపారదొబ్బుతా.. మాస్ డైలాగులతో అఖండ ట్రైలర్
Bheemla nayak | RRR టీంను కంగారు పెడుతున్న పవన్ కళ్యాణ్..